Friday, 19 October 2018


001. SIRAJ-UD-DOULAH ,  NAWAB OF BENGAL (1733-1757)


Siraj-ud-Doulah, the Nawab of Bengal was the first Indian king to foresee the threat posed to the future of  the country by the English East India Company which entered India in the name of trade but transgressed its limits. He took bold initiatives to thwart the company's evil designs. The last independent Nawab of Bengal, Siraj-ud-Doulah, was born in 1733 and took the reins of power at the age of 23 years. Taking  advantage of the troubles faced by Siraj-ud-Doulah from his kinsmen, the East India Company started exploiting the people including the farmers and businessmen. Siraj, then took initiative to curb those atrocities. Though he succeeded initially,  because of  his attitude of forgiveness towards the enemy, he had to pay a heavy price which proved catastrophic to the future of India. Under those adverse circumstances, his adversaries  like Siraj’s aunt  Ghasitee Begum, her adopted son Shaukat Jung, his supporter Krishna Das, who was the son of Diwan Raj Vallabh, Siraj’s Commander-in-Chief,  Mir Jafar who was his uncle, influential traders Manik Chand, Ameer Chand and Banker Jagath Sethi had hatched a conspiracy along with Robert Clive to overthrow Siraj.  As Siraj was unaware of the clique  against him, he reached Plassey with about 50,000 troops to fight against  the British forces. The Battle of  Plassey , which marked a watershed in Indian history  started on 23 June ,1757. The East India Company’s troops were only 3,200 and the British troops among them numbered just 950. But the treacherous  Commander-in-Chief,  Mir Jafar, and another Commander, Roy Durlabh, deserted Nawab Siraj-ud-Daulah  in the middle of  battle field in favour of  the East India Company’s troops. As a result, Siraj-ud-Doulah was forced to face defeat and he returned to Murshidabad, the capital on 24 June. Even there, the situation was unfavourable  to young Nawab. With no option  left for him, Siraj left the capital. Meanwhile, Mir Jafar was appointed the Nawab of  Bengal  by  Robert Clive.  Mir Jafar sent his son, Mir Miran, with troops to catch Siraj. Young Siraj was caught  and brought to the court and  beheaded  on 2 July, 1757.  Nawab of Bengal  Siraj-ud-Doulah will be remembered  in the  Indian history as the ‘first warrior’, who sensed the danger from the  British and fought against them heroically.
===
Source : The Immortals (Album of 155 pictures of Muslim Freedom Fighters) By Syed Naseer ahamed Publ;ished in 2014. Mobile : + 91 9440241727
=====

Saturday, 31 May 2014



BOOKS OF SYED NASEER AHAMED in TELUGU.
(On the role of Muslims in the struggle for the freedom of India.

08). CHIRASMARANEEYULU (First Part)
This Book contains total 224 pages of 1/8th Demmy Size. It was first published in 2008, and Reprinted with in four months in 2009

In this book brief life Sketches (each two pages) of 100 Muslim Heroes who fought against British is given. It started from Bengal Nawab Sirajuddowla of 1757 Palsy War to 1947 Shaik Moula Saheb ( Andhrapradesh) was given. Almost all sketches are having photos of freedom fighters.
Three more Parts of this book is Planed and May come out with in one or two Years if circumstances allowed

If any one like to read this book, Pdf files will be sent to them free of cost on request to naseerahamedsyed@gmail.com

BOOKS OF SYED NASEER AHAMED in TELUGU


BOOKS OF SYED NASEER AHAMED in TELUGU.
(On the role of Muslims in the struggle for the freedom of India.

09) BHARATHA SWATHANTRODYAMAM : ANDHRA PRADESH MUSLIMLU.
( INDIAN FREEDOM MOVEMENT: ANDHRAPRADESH MUSLIMS )
Total 398 pages of 1/8 the Demmy Size, 2011.
It was published first time in 2001 August. Later on it was reprinted in 2001 December. After that it was completely revised and reprinted in 2011.

In this book the Role of Andhrapradesh Muslims in the Indian Independence Struggle is explained in detail. It gives general information about the role of Muslims in the struggle for India’s Independence starting from 1757 to 1948.
In Addition to this this book provides biographical sketches of 60 Muslim Freedom Fighters of Andhra pradesh in detail with their photos or pictures. Very rare photos will be found in this voluminous book.
No only this very Brief details of more than 720 Muslim freedom fighters of AP also given (District Wise)
If any one like to read this book, Pdf files will be sent to them free of cost on request to naseerahamedsyed@gmail.com

Saturday, 19 October 2013

అష్ఫాఖుల్లా ఖాన్‌
(1900-1927)

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్‌ వలస పాలకులపై విప్లవించి అమరులైన యోధాగ్రేసులలో ఒకరు అష్ఫాఖుల్లాఖాన్‌ .
1900 అక్టోబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని సంపన్న జవిూందారి కుటుంబంలో అష్ఫాఖ్‌ జన్మించారు. తండ్రి షఫీఖుల్లాఖాన్‌. తల్లి మజహరున్నీసా బేగం. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలను సంతరించుకున్న ఆయన ప్రజల జీవన పరిస్థితుల విూద దృష్టి సారించటంతో చదువు విూద పెద్దగా శ్రద్ధచూపలేదు. తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్
న ఆయన మంచి ఉర్దూ కవిగా రూపొందారు.
అష్ఫాఖుల్లా Abbie Rich Mission High School 8వ తరగతి విద్యార్థిగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ కవితలు రాస్తూ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను చిన్నతనంలోనే వ్యక్తంచేశారు. ఆ క్రమంలో 'హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ' నాయకులు రాం ప్రసాద్‌ బిస్మిల్‌తో ఏర్పడిన పరిచయం ద్వారా విప్లవోద్యమంలో భాగస్వామి అయ్యారు. మతం కారణంగా ఆర్యసమాజానికి చెందిన బిస్మిల్‌ హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో అష్ఫాక్‌కు సభ్యత్వం ఇవ్వడానికి సంశయించినా చివరకు అంగీకరించక తప్పలేదు. ఆర్మీ సభ్యునిగా బిస్మిల్‌ నేతృత్వంలో జరిగిన పలు యాక్షన్‌లలో చురుగ్గా అష్ఫాఖ్‌ పాల్గొన్నారు. బలమైన శత్రువును మాతృభూమి నుండి తరిమి కొట్టేందుకు ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా విప్లవకారుల కన్ను ప్రభుత్వపు ఖజానా విూద పడింది. ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుండి ధనాన్ని కొల్లగొట్టేందుకు పథకం తయారయ్యింది. ఈ పథకం పట్ల తొలుత అష్ఫాఖ్‌ అయిష్టత వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ఖజనాను అపహరిస్తే ప్రభుత్వం విప్లవోద్యమం విూద విరుచుకపడగలదని, ఆ కారణంగా బాల్యావస్థలో నున్న విప్లవోద్యమం కోలుకోలేనంత దెబ్బ తింటుందని హెచ్చరించారు. అయినా ప్రజాస్వామిక సిద్ధాంతం పట్ల గౌరవంగల ఆయన సహచరుల మెజారిటీ నిర్ణయానికి సమ్మతి తెలిపారు.
ఆ పథకం ప్రకారంగా 1925 ఆగష్టు 9న కాకోరి గ్రామం విూదుగా వెళ్ళే మెయిల్‌లో తరలిస్తున్న ప్రభుత్వ ఖజానాను పది మంది సభ్యుల గల విప్లవకారుల దళం సాహసోపేతంగా కైవసం చేసుకుంది. ఈ పథకాన్ని అమలుపర్చటంలో క్రమశిక్షణ గల విప్లవకారునిగా అష్ఫాఖ్‌ తనదైన పాత్రను నిర్వహించారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బ్రిటీష్‌ ప్రభుత్వం అష్ఫాఖ్‌ ఊహించినట్టే విప్లవకారుల విూద విరుచుకపడటంతో అష్ఫాఖుల్లాతో పాటుగా ఆర్మీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
అష్ఫాఖుల్లా మాత్రం ఏడాదిపాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన ఒక మిత్రద్రోహి కారణంగా ఢిల్లీలో అరెస్టయ్యారు. ఆయనకు పలు ఆశలు చూపి, మత మనోభావాలను కూడా రెచ్చగొట్టి లొంగదీసుకోటానికి ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది. చివరకు కాకోరి రైలు సంఘటన విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆర్మీ నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను శిక్ష నుండి తప్పించేందుకు కాకోరి రైలు సంఘటనకు తాను మాత్రమే పూర్తి బాధ్యుడనంటూ తన న్యాయవాది సలహాకు భిన్నంగా ఉన్నత న్యాయస్థానానికి అష్ఫాఖ్‌ రాతపూర్వకంగా తెలుపుకున్నారు. చివరకు ఆయనతోపాటు సహచర మిత్రులకు కూడా కోర్టు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది.
మాతృభూమి కోసం ప్రాణాలర్పించటం మహాద్భాగ్యమని ప్రకటించిన అష్ఫాఖ్‌ను 1927 డిసెంబరు 19న ఫైజాబాదు జైలులో ఉరితీశారు. ఈ సందర్భంగా 'నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి. నా హిందూస్థాన్‌కు స్వేచ్ఛ లభిస్తుంది చూడండి. చాలా త్వరగా బానిసత్వపు సంకెళ్లు తెగిపోతాయి' అని ఎంతో ఆత్మవిశ్వాసంతో దేశ భవిష్యత్తును ప్రకటించిన అష్ఫాఖుల్లా ఖాన్‌ ఉరితాడును సంతోషంగా స్వీకరిస్తూ, తన వందేళ్ళ జీవితాన్ని 27 ఏళ్ళకే ముగించుకుని తరలి వెళ్ళిపోయారు. (Taken from Syed Naseer Ahamed book CHIRASMARANEEYULU)

Monday, 7 October 2013

దళిత జన హితైషి, పోలియో వ్యతిరేక పోరాటయోధురాలు
'పద్మశ్రీ' ఫాతిమా ఇస్మాయిల్‌
(1903-1987)

జాతీయోద్యమం భారతీయులలో మహత్తర సేవాతత్పరతకు  ప్రేరణయ్యింది.  ఆ స్ఫూర్తితో కుటుంబాలకు కుటుంబాలు ఉద్యమంలో పాలుపంచుకున్నాయి.  బ్రిటీష్‌ వలస పాలకుల కిరాతకాలను లెక్కచేయక పోరుబాటన నడిచాయి.  అటువంటి కుటుంబంలో సభ్యురాలిగా తల్లి-తండ్రి,అన్నా-తమ్ముళ్ళ బాటలోసాగి అటు జాతీయోద్యమంలో ఇటు సేవారంగంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించిన మహిళ శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌.
నాటి గుజరాత్‌ రాష్ట్రం బొంబాయికి చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్రోద్యమ నాయకులు హజీ ముహమ్మద్‌ యూసుఫ్‌ సోహాని కుమార్తె బేగం ఫాతిమా. ఆమె కుటుంబం సంపన్న మోమిన్‌ వంశానికి చెందినది. ఆమె అన్నయ్య ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని. చిన్నన్నయ్య ముహమ్మద్‌ ఉస్మాన్‌ సోహాని. ఉమర్‌ సోహాని బొంబాయిలో ప్రముఖ వ్యాపారవేత్త. ఆ ఇరువురు సోదరులు కూడా తండ్రి మార్గంలో విముక్తిపోరాట బాటలో ముందుకు సాగారు. జాతీయోద్యమ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమగు ఆర్థిక పుష్టిని అందించటంలో ఆ సోదరులు  ముందున్నారు. ఆనాడు భూరిగా విరాళాలు అందచేతలో ప్రధానంగా  ఉమర్‌ సోహాని ప్రఖ్యాతి గడించారు.
మహాత్మాగాంధీ తిలక్‌ ఫండ్‌ కోసం ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని  వద్దకు రాగా తన చెక్కుబుక్‌ను ఆయకిచ్చి ఇష్టమొచ్చినంత రాసుకోమన్నారు. గాంధీజీ లక్ష రూపాయలను రాయగా అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. ఆ తరువాత ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం ఖిలాఫత్‌ నేతలు ఉమర్‌ సోహానిని  కలువగా వారికి కూడా ఆయన లక్షరూపాయాల విరాళం ఇవ్వటమే కాకుండా ఖిలాఫత్‌ కార్యాలయం ఏర్పాటుకు తన స్వంత భవంతిని అప్పగించారు. ఆ తరువాతి కాలంలో ఆ భవంతి ఖిలాఫత్‌ హౌస్‌ గా పిలువబడింది.(Muslims In India, Volume -II, Naresh Kumar Jain, Manohar, New Delhi, 1979, Page : 162).
ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని చాలా ఉదార స్వభావులు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధుల అందచేతలో తానెప్పుడూ ప్రథమ స్థానంలో ఉండాలన్నది ఆయన అభిమతం. ఆ కారణంగా ఉద్యమనాయకులు ఆయన సహాయం కోరివస్తే అందరి కంటె అధిక మొత్తాన్ని అందించి ఆనందించటం ఆయన అలవాటు. ఆ అలవాటుకు తగ్గట్టుగా వ్యాపారంలో ఆయన అపారంగా ఆర్జించారు. ఆ క్రమంలో ఓ మాసంలో ఆయన సంపద ద్విగుణీకృతమైంది. ఆ తరువాత దురదృష్టవశాత్తు మరుసటి నెలలో అనూహ్యంగా కోట్లాది రూపాయలను ఆయన నష్టపోయారు. ఆ నష్టంతో ఆయన బాగా క్రుంగిపోయారు. ప్రజోపకర కార్యకలాపాలకు, ప్రధానంగా జాతీయోద్యమానికి ఆర్థిక సహాయం అందించటంలో ముందు ఉండలేకపోయినందున ఆయన ప్రజా జీవితం నుండి దూరం కావాలనుకున్నారు. (ఖతిరీజిరిళీరీ |దీ |దీఖిరిబి, ఆబివీలి : 162).
ఆ విధంగా  ప్రజా జీవితం నుండి రాజకీయాల నుండి దూరమైన సోహానిని వ్యాపారంలో వచ్చిన అపారనష్టం కల్గించిన వేదన కంటే  ప్రజలకు,  ఉద్యమకారులకు, జాతీయోద్యమానికి తాను ఏవిధంగానూ ఉపయోగపడలేక పోయాన్న దిగులు ఆయనలో అధికమయ్యింది. ఆ బాధతో సతమతమౌతూ 36 సంవత్సరాల వయస్సులో 1926 జూలై 6న ఆయన కన్నుమూశారు. ఆ సందర్భంగా, His untimely and sudden death has removed a patriot from the country అని  వ్యాఖానిస్తూ మహాత్మాగాంధీ యంగ్‌ ఇండియాలో ఆయనకు నివాళులర్పించారు.
అటువంటి ఉదార హృదయులు, త్యాగశీలుర కుటుంబంలో  బేగం ఫాతిమా 1903 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. ఆమె  తండ్రి యూసుఫ్‌ సోహాని, సోదరులు  ఉమర్‌ సోహాని, ఉస్మాన్‌ సోహానిలు కూడా జాతీయోద్యమకారులు. ఆ జాతీయోద్యమ నేతల గారాల పట్టిగా పెరిగిన కుమారి ఫాతిమా చిన్నతనం నుండే బ్రిటీష్‌ వ్యతిరేక భావాలను పుణికి పుచ్చుకున్నారు. అన్యాయాన్ని, అధర్మాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా ధైర్యంగా ఎదుర్కోవటం  గుణంగా ఆమె ఎదిగారు. స్వేచ్ఛా-స్వాతంత్య్రాల పట్ల మక్కువ ఎక్కువ. అహేతుక ఆచార, సంప్రదాయాలకు ఆమె వ్యతిరేకి. సకారాత్మకమైనా నకారాత్మకమైనా తన అభిప్రాయాన్ని నిర్భీతిగా ప్రకటించటం ఆమె అలవాటు. 
1919లో ఆమె సీనియర్‌ కేంబ్రిడ్జి పూర్తిచేసి 1920లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఉర్దూ, ఆంగ్ల భాషలలో మంచి విద్వత్తును సాధించారు. 1921-1923లో వియన్నాలో వైద్యవిద్య చదవడానికి వెళ్ళిన ఆమె అనివార్య కారణాల వలన వైద్యవిద్యను అసంపూర్ణంగా వదిలేశారు.
ప్రభుత్వ ఉన్నతోద్యోగి హసన్‌ ఇస్మాయిల్‌ను ఆమె వివాహమాడారు. ఆయన కూడా స్వాతంత్య్రోద్యమాభిమాని. భర్త ప్రోత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలో భాగంగా సాగిన స్వదేశీ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ఫాతిమా ఇస్మాయిల్‌ జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. స్వదేశీ వస్తువులను విక్రయిం చేందుకు, వినూత్న ఏర్పాట్లు చేసి ప్రజల, ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. విదేశీ వస్తువులను బహిష్కరించమని కోరటం మాత్రమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలనుకున్నారు. ఆ ఆలోచన రావటమే తరువాయి రైలులోని ఓ ప్రత్యేక బోగిలో స్వదేశీ వస్తుసామగ్రిని నింపుకుని  ఆ సామగ్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తూ, స్వదేశీ ఉద్యమ సందేశాన్ని వ్యాప్తి చేశారు. స్వదేశీ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా, స్వదేశీయులచే పలు కుటీర పరిశ్రమల స్థాపనకు ఆమె కృషి సల్పారు.
 1934లో సమాజోద్ధరణలో భాగంగా మహిళలను చైతన్యవంతుల్ని చేసి సంఘటిత పర్చేందుకు సంఘాలు, సంస్థలు స్థాపించారు. అంజుమన్‌ ఇస్లాహే నిశ్వా మహిళా సుధార్‌ సమితి అను సంస్థను స్వయంగా ఆరంభించారు. 1935లో ఆమె అఖిల భారత మహిళా సమావేశానికి కార్యదర్శిగా నియుక్తులయ్యారు. బొంబాయి ముస్లిం మహిళలలో వయోజన విద్యా వ్యాప్తికిఎంతో కృషిచేశారు. పలు సంఘాలను, సేవా సంస్థలను స్థాపించి, ఆయా సంస్థల అభివృద్ధికి శ్రమించారు. ఈ మేరకు మహిళలలో జాగృతికోసం  చేస్తున్న  కృషి ఫలితంగా 1937-1940ల మధ్యలో ఆమె అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్‌ హస్టల్‌ కార్యదర్శి బాధ్యతలు లభించాయి.
ఆ క్రమంలో 1940లో బొంబాయి ఉమెన్స్‌ కౌన్సిల్‌కు చెందిన లేబర్‌ సమితికి ఉపాధ్యకక్షురాలయ్యారు. ఆ పదవిలో ఆమె కార్మికుల కుటుంబాలలో మహిళల పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రయత్నించారు. ఆమె స్వయంగా కర్మాగారాలకు చుట్టుపక్కల ఉంటున్న కార్మికవాడలకు వెళ్ళి కార్మిక కుటుంబాల మహిళలతో వారి సమస్యల విూద చర్చించారు. ఆ మహిళల సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక మార్గాలను సూచిస్తూ మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత గ్రావిూణోద్యోగ సంఘం ఏర్పాటుకు పునాదులు వేశారు. సమస్యలతో సతమతమవుతున్న మహిళలు తమ సమస్యలను తాము పరిష్కరించుకుంటూ, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కుటీర పరిశ్రమలను, చేతి వృత్తులను ప్రోత్సహించారు. ఆ కృషిలో భాగంగా పలు మహిళా సంక్షేమసంఘాలను ఏర్పాటు చేశారు.
  1942లో ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమంలో  ఫాతిమా ఇస్మాయిల్‌ క్రియాశీలపాత్ర వహించారు. ఈ ఉద్యమంలో పోలీసుల అరెస్టులను తప్పించుకుంటూ  ఆమె పనిచేశారు. ఒకథలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1940లో రాంఘర్‌, 1943లో బొంబాయిలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు పాతిమా ఇస్మాయిల్‌ హజరయ్యారు. ఖద్దరు, స్వదేశీ ఉద్యమ ప్రచారం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, హిందూ- ముస్లింల ఐక్యత ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకుని ఆమె ముందుకు సాగారు. ఈ లక్ష్యాల సాధన కోసం సాగించిన ప్రయత్నాలలో భాగంగా  ఆమె పలు ప్రాంతాలను సందర్శించారు. 
క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఫాతిమా ఇస్మాయిల్‌  చురుకైన భాగస్వామ్యం వహిస్తుండగా 1944 ప్రాంతంలో ఆమె కుమార్తె పోలియో బారిన పడింది. ఆ కారణంగా కుమర్తె అవిటితనానికి గురైంది. బిడ్డ అవిటిగా మారటంతో  ఫాతిమా ఇస్మాయిల్‌  తీవ్రంగా కలత చెందారు. పోలియో పరిణామాల నుండి ఆమెను కాపాడుకునే ప్రయత్నాలలో లక్షలాది పిల్లలు పోలియో రక్కసి బారిన పడి వికలాంగులుగా మారుతున్న దుస్థితిని గమనించారు.  సరైన చికిత్స లేని ఆ వ్యాధి నుండి పిల్లలను కాపాడుకునేందుకు వ్యాయామం ఒక్కటే కారణమని తెలుసుకున్న ఆమె ఆ దిశగా తన బిడ్డ విూద ప్రయోగాలు చేశారు. ఆమె ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి. దానితో పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమని ఆమెకు విశ్వాసం కలిగింది. కష్టసాధ్యమైన ఆ మహాత్తర లక్ష్యసాధనకు పూర్తికాలపు సేవలు అవసరమని ఆమె భావించారు. ఆ క్షణం నుండి  ఆమె సాగిస్తున్న బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి పోలియో నుండి బిడ్డలను కాపాడేందుకు పోలియో విూద ఆవిశ్రాంత పోరాటం సల్పేందుకు నడుంకట్టారు.
  ఆమె గతంలో  వైద్యశాస్త్ర విద్యార్థి కావటంతో పోలియో నివారణ, నియంత్రణ కార్యక్రమాల విూద ప్రత్యేకంగా శిక్షణ పొందారు. బొంబాయికి చెందిన డాక్టర్‌ బాలిగాతో కలిసి పోలియో రోగగ్రస్తులైన పసిబిడ్డలకు వ్యాయామం ద్వారా పోలియోను నయం చేసేందుకు  1947లో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ కోసం పోలియో రోగగ్రస్త బిడ్డల ఆరోగ్యం కోసం ఫాతిమా ఇస్మాయిల్‌ పూర్తి కాలాన్ని వినియోగించటం ప్రారంభించారు. పండిత నెహ్రూ కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ కుటుంబం సహాయ సహకారాలతో పోలియో నివారణ సంస్థను, ఆ సంస్థ కార్యక్రమాలను మరింతగా విస్తరింపచేశారు. 
 ఈ క్రమంలో పేదరికం, అనారోగ్యం పట్టిపీడిస్తున్న కార్మికులను, అజ్ఞానం, ఆర్థిక బలహీనతలతో బానిసల కంటే దుర్భరంగా బ్రతుకులీడుస్తున్న మహిళలనూ, సాంఘిక అసమానతలు, సామాజిక దురాచారాలను, అంటరానితనంతో అత్యంత హీనంగా చూడబడుతున్న దళిత జనసముదాయాల స్థితిగతులనూ అతిసవిూపం నుండి గమనించారు. ఆ అవాంఛనీయ పరిస్థితులలో మౌలిక మార్పుకోసం పనిచేయటం ఆరంభించారు.  ఈ దిశగా ఆమె తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. శ్రమ జీవుల పక్షాన పోరాటాలు చేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత విషయాలలో చైతన్యం కోసం కృషి సల్పారు.  కర్మాగారాల వాతావరణం, పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు.
జాతీయ అంతర్జాతీయ సంస్థల పిలుపు మేరకు,  పోలియో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను, పసిబిడ్డల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరిస్తూ పలు విదేశీ పర్యటనలు జరిపారు, ఆమె స్వయంగా పలు చోట్ల  శిక్షణ పొందారు. స్వదేశంలో స్థాపించబడిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు చేయూతనిచ్చారు. పోలియో పీడితులకు మాత్రమే కాకుండా అంగవికలాంగుల ఉద్ధరణకు కూడా ఆమె కృషిచేశారు. వికలాంగులకు ప్రభుత్వం నుండి సదుపాయాలు కలుగజేసేందుకు ఆమె నిరంతరం శ్రమించారు. వికలాంగుల సేవా కేంద్రాల స్థాపనను ప్రోత్సహించారు.     
ఈ  మేరకు అటు  పోలియో విూద అవిశ్రాంత పోరాటం చేస్తూ, ఇటు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా తిరుగులేని యుద్ధం ప్రకటించిన ఫాతిమా ఇస్మాయిల్‌  ఆచరణాత్మక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డుతో  గౌరవించింది. దళిత ప్రజల విూద కొనసాగుతున్న సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ దళిత జనావళి అభ్యున్నతి కోసం ఆమె సాగించిన కృషి గమనించిన దళిత ప్రజలు స్వయంగా 1972లో  దళితమిత్ర  అవార్డుతో ఆమెను సత్కరించుకున్నారు. ఈ విధంగా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆమెకు  గౌరవసత్కారాలు లభించాయి. పలు అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఆ విధంగా లభించిన పురస్కారాలన్నిటిని ఆమె మార్గదర్శకత్వంలో సాగుతున్న సేవాసంస్థల ఆర్థిక పరిపుష్టికి వినియోగించారు.
 ప్రజాసేవారంగాలలో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొంది, స్వాతంత్య్ర సమరోద్యమకారిణిగా, పోలియో నియంత్రణకు అవిరళ కృషి సల్పిన యోధురాలిగా, భారతీయుల ప్రియతమ సంఘసేవకురాలిగా, ఖ్యాతిగాంచిన ఫాతిమా ఇస్మాయిల్‌ 1979 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ పదవిలో 1985 వరకు పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఆమె సంఘసేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించారు.
ఈ విధంగా జీవిత చరమాంకం వరకు ప్రజాసేవలో గడిపిన శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌ 1987 అక్టోబర్‌ 11న కన్నుమూశారు.

Thursday, 19 September 2013

తిరగబడ్డ చీరాల-పేరాల ప్రజలకు బాసటగా నిలచిన

ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌

(1885 -1976)


జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సాగిన 'చీరాల-పేరాల' పోరాటం చాలా ప్రఖ్యాతిగాంచింది. అద్భుత పోరాటపటిమతో సాగించిన ఈ శాంతియుత ఉద్యమం జాతీయోద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఆ పోరాటంలో ప్రధాన భూమిక నిర్వహించిన యోధులలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ఒకరు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం గంటాయపాలెంలో 1885 సెప్టెంబరు 12న ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ జన్మించారు. తల్లితండ్రులు హాజీ మోహిద్దీన్‌ బేగ్‌, ఫాతిమా. గౌస్‌బేగ్‌ తాత ముహమ్మద్‌ దిలావర్‌ బేగ్‌ సంపన్న వ్యాపారవేత్త. చీరాలకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న వోడరేవులో ఈయన వోడలు ఉండేవి. పెద్ద ఎత్తున గోడవున్సుకు యజమాని. భారీ ఎత్తున వ్యాపారం చేసిన ఘనాపాటి...గౌస్‌ సాహెబ్‌ తండ్రి హయాములో వోడరేవు వ్యాపారం స్థంభించింది. కాని విస్తృతమైన ఆస్థి, సిరిసంపదలు సంక్రమించాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరదావు, 1989, పేజి.60).
ముహమ్మద్‌ గౌస్‌ 1907లో విద్యార్థిగానే వందేమాతరం ఉద్యమం రోజుల్లో జాతీయోద్యమంలో ప్రవేశించారు. బాపట్లకు చెందిన బేగ్‌కు 'చీరాల-పేరాల ఉద్యమం' నిర్మాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పరిచయం ఏర్పడింది. ఆయనతో కలసి 1920లో కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరు కావడంతో గౌస్‌ రాజకీయ జీవితం ఆరంభమైంది. ప్రకాశం జిల్లా చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘం ఏర్పాటు చేసి ప్రజానీకం మీద ప్రభుత్వం అత్యధిక పన్నుల భారం మోపింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య రంగ ప్రవేశం చేశారు. ఆయన అత్యంత సన్నిహిత సహచరుడిగా గౌస్‌ బేగ్‌ కూడా ప్రత్యక్షకార్యాచరణకు దిగారు.1921 ఏప్రిల్‌ 6న, విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీని దుగ్గిరాల కలిసి ఉద్యమ కార్యాచరణకు అనుమతి పొందడంతో 'చీరాల-పేరాల' ఉద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకున్న భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులలో గౌస్‌ బేగ్‌ ఒకరు. ఈ ఉద్యమంలో ప్రజానీకం ఆర్థిక ఇక్కట్లు పడుతున్నందున పూర్వీకులు సంపాదించి పెట్టిన సంపదను ప్రజావసరాలకు వ్యయం చేశారు. ఆ విధంగా ఉద్యమానికి సర్వసంపదను, వెచ్చించి బలాన్ని చేకూర్చిన యోధుడు జనాబు గౌస్‌ బేగ్‌ గా ఆయన ఖ్యాతిగడించారు. (స్వాతంత్య్రోద్యమం దేశ నాయకులు, వి.యల్‌.సుందరరావు, 1989, పేజి.61)
1921 నాటి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. జాతీయోద్యమ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొంటూ వచ్చిన గౌస్‌బేగ్‌ ఒంగోలు కారాగారంలో ఉన్న సందర్భంగా ఐపియస్‌ అధికారి హైదరీ దొర ఆయనను బంగళాకు తీసుకెళ్ళి బ్రాహ్మణ ప్రేరేపిత ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారు. మీ సాహెబులందరికి చెడ్డపేరు వస్తుంది. మీరు కోరుకుంటే 100 లేక 200 ఎకరముల భూమిని మంజూరు చేస్తా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశాడు. అందుకు, ఈ రోజు పండగ రోజు (రంజాన్‌) నన్ను జైలుకు పోనివ్వండి. ఈ దేశభక్తి ఉన్మాదునికి కళంకం ఆపాదించకండి, అని గౌస్‌ సమాధానం చెప్పడంతో, ఆ ఆధికారి ఏడాది జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించాడు. ఆ శిక్షను 1922 మార్చి రెండున నుండి రాజమండ్రి, కడలూరు జైళ్ళలో గౌస్‌ బేగ్‌ అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక 'ఆంధ్రరత్న' గోపాలకృష్ణయ్య స్థాపించిన స్వచ్ఛందసేవకుల దళం 'రామదండు'కు ఆయన నాయకత్వం వహించి, జాతీయోద్యమ భావాలను ప్రజలలో ప్రచారం చేసేందుకు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించారు.
ఆనాటి నుండి గౌస్‌ సాహెబ్‌ జాతీయోద్యమ కార్యక్రమాలన్నిటిలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న క్రమంలో ఆస్తి అంతా కరిగిపోయింది. కుటుంబానికి భుక్తినిస్తున్న 23 ఎకరాల భూమిని విక్రయించి మరీ ఉద్యయం కోసం వ్యయం చేశారు. ప్రముఖ నేతలు భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయమ్మ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి ప్రముఖులు, కార్యకర్తలు గౌస్‌ బేగ్‌ ఇంట ఆతిధ్యం స్వీకరించేవారు. ఆనాటి ఉద్యమకారులకు గౌస్‌ గృహం, తమ స్వంతిల్లు లాగుండేది. నగదు నట్రా, పొలం పుట్రా కరిగిపోతున్న, బేగ్‌ దంపతులు బేఖాతర్‌ అన్నారు. మాతృభూమి కోసం సర్వం త్యాగం చేయగలిగిన వారే అదృష్టవంతులని మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ దంపతులు అభిప్రాయపడ్డారు. ఆ ఆభిప్రాయలకు అనుగుణంగా జాతీయోద్యమం కోసం తమ సర్వసంపదలను, చివరకు గౌస్‌ ఖాతూన్‌ ఆభరణాలను కూడా వ్యయంచేశారు. గౌస్‌ బేగ్‌ జాతీయోద్యమంలో ప్రవేశించాక ఆయనకు పూర్వీకులనుండి సంక్రమించిన మణులు, మాన్యాలు, తోటలు, భవంతులు అన్నీ హారతి కర్పూరంలా కరిగి పోయాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఆయన వ్యాపారాలన్నీ స్థంభించి పోయాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరరావు)
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సలహా మీద గౌస్‌ వ్యాపారం ఆరంభించారు. ఆయన వ్యాపార సంస్థకు 'రాం రహీమ్‌' అని నామకరణం చేశారు. ఆర్థికంగా పూర్వవైభవాన్ని సంపాదించేందుకు పలు వ్యాపారాలు చేశారు. వ్యాపారం ద్వారా లాభాలు అర్జించటం కంటె ఆయన దృష్టి అంతా జాతీయోద్యమం మీద లగ్నం కావడంతో వ్యాపారాలు లాభాల మాట అటుంచి పూర్తిగా నష్టాల బాటన సాగాయి.
1930-32 ప్రాంతంలో ఉప్పుసత్యాగ్రహానికి ఆయన నాయకత్వం వహించారు. చీరాలలోని యువకుల ఆహ్వానం మేరకు వెళ్ళి స్వచ్ఛంద సేవకులను అడ్డుకుంటున్న పోలీసులను లెక్కచేయకుండా ఉప్పు గుండాలలోకి ప్రవేశించి ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయన చూపిన చొరవతో మిగిలిన నాయకులు, యువకులు గౌస్‌ను అనుసరించారు. (గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం, మాదల వీరభద్రరావు, పేజి.141). ఈ సందర్భంగా దేవరంపాడు శిబిరానికి గౌస్‌ నాయకత్వం వహించి నడిపారు. ఆ శిబిరాన్ని నడిపినందుకు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్షను ప్రభుత్వం విధించింది. ఈ సందర్భంగా ఆయన పిడికిటిలోని ఉప్పు తీయటానికి పోలీసు లాఠీలు విఫలమైనాయి. ఆయనను ఎన్నోవిధాల హింసించినారు. ఈ సంఘటనను ఆంధ్రదేశమంతట ఎన్నో కథలుగా చెప్పుకున్నారు. ఈ విధంగా శాసనోల్లంఘన ఉద్యమంలో గుంటూరు జిల్లా ఉద్యమంలో క్రియాశీలక పాత్రను నిర్వహించినందుకు, ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 1930 ఏప్రిల్‌ 24న ఏడాది జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో ఉన్న కొద్దిపాటి చరాస్థిని వేలం వేసి, లభించిన నగదును జరిమానా క్రింద ప్రభుత్వం జమ చేసుకుంది.
శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ క్రియాశీలక పాత్రను నిర్వహించారు. ఆ ఉద్యమనేత పర్వతనేని వీరయ్య చౌదరి ప్రధాన సహచరుడిగా ఆయన వ్యవహరించారు. ఆ పన్ను నిరాకరణ ఉద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ సాగిన ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పాత్రను నిర్వహించినందున పోలీసుల దాష్టీకానికి పలుమార్లు గురయ్యారు. చివరకు 1932 మార్చి 10న ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, పాతిక రూపాయల జరిమానాను ప్రభుత్వం విధించి వెల్లూరు, రాజమండ్రి జైళ్ళలో నిర్బంధించింది. ఆ తరువాత 1933 జూలై 3న ముహమ్మద్‌ గౌస్‌బేగ్‌ విడుదలయ్యారు.
మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మంచి వక్త. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు ప్రముఖ వక్తగా హజరై ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల భారత జాతీయ కాంగ్రెస్‌ అగ్రనాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన మితభాషి, నిశ్చల శాంత స్వభావుడు. ఎటువంటి హంగు-ఆర్భాటం, హడావుడి లేకుండా ఒకచోటన స్థిరంగా ఉంటూ కనుసైగలతో ఎంతటి కార్యాన్ని సన్నిహితులతో విజయవంతంగా పూర్తిచేయించగల కార్యదక్షత కలిగిన నాయకుడిగా పేర్గాంచారు. భారతదేశానికి స్వాతంత్య్ర లభించేంత వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాలను ఆయన త్రికరణ శుద్ధిగా పాటించారు. ఆనాడు ఆంధ్రదేశంలో గౌస్‌ బేగ్‌ తెలియనివారు లేరు. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌. సుందరరావు) మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మాత్రమే కాకుండా ఆయన సతీమణి గౌస్‌ ఖాతూన్‌ స్వాతంత్రోద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను త్యజించిన ఆ దంపతులు జీవితాంతం ఖద్దరు ధరించారు.
స్వాతంత్య్రం సిద్ధించాక కూడా కొంతకాలం గుంటూరు జిల్లా రాజకీయాలలో మహమ్మద్‌ గౌస్‌ పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌ కమిటీ అద్యకక్షునిగా బాధ్యతలను నిర్వహించారు. 1961లో తమ స్వగ్రామం నుండి చీరాలకు వచ్చి గౌస్‌ స్దిరనివాసం ఏర్పరచుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా ఉంటూ, చీరాల పురపాలక సంఘం సభ్యునిగా విజయం సాధించి పురపాలక సంఘం ఉపాద్యకక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
చిన్ననాట నుండి మతసామరస్యం కోరుతూ వచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా, మత దురహంకారాన్ని నిరసిస్తూ, విభిన్న మతస్థుల మధ్యన సద్భావన, సదవగాహన కలిగించడం కోసం హిందూ-ముస్లింల మధ్య పటిష్టమైన స్నేహ సంబంధాల కోసం నిరంతరం కృషి సల్పారు. మనుషుల మధ్యన మత భేదభావాన్ని ససేమిరా అన్నారు. మతసామరస్యం కాపాడటం, వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్యన 'శాంతి-స్నేహం' పటిష్టపర్చేందుకు చివరిశ్వాస వరకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు.
జాతీయోద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ప్రదర్శించిన సాహసానికి త్యాగనిరతికి గౌరవ సూచకంగా 1972 ఆగస్టు 15న భారతప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. చివరి క్షణం వరకు ప్రజలలో దేశభక్తి, స్నేహభావాలను పరిమళింపచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ 1976 సెప్టెంబరు 19న కన్నుమూశారు.
 ' ప్రమాదంలో ఇస్లాం '  నినాదం ప్రమాదాన్ని పసిగట్టి తిరస్కరించిన
 మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని
   

    భారత దేశ విభజన జరగటానికి దోహదం చేసిన పలు కారణాలలో '|ఐఉజుఖ |శ్రీ ఈజుశ్రీస్త్రజూష్ట్ర' అను నినాదం ఒకటి.   ద్విజాతి సిద్దాంతం  పేరిట దేశాన్ని ముక్కలు చేసి తమ పబ్బం గడుపుకోవాలని ఆశించిన స్వార్ధపరులు హిందూ-ముస్లింల మత మనోభావాలను రెచ్చగొట్టి విజయం సాధించారు. విభజన ద్వారా లబ్ది పొందాలనుకున్న రాజకీయ నాయకులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్‌ తదితర వ్యక్తులు, శక్తులు తమ లక్ష్యాన్ని సాధించుకోవటానికి వివిధ మార్గాలను అన్వేషించాయి. ఈ మేరకు సాగిన అన్వేషణలో 'ప్రమాదంలో ఇస్లాం' అను నినాదం బలమైన ఆయిధంగా చిక్కింది. ఆ నినాదం ఆసరాతో ముస్లిం జనావళిని ఉద్వేగాల తుఫానుకు గురిచేశారు. ఆ ప్రమాదాన్ని ఆనాడే పసిగట్టిన పలువురు ముస్లిం నాయకులు, ఆ నినాదం వెనుక గల దురుద్దేశాలను ప్రజలకు వివరించారు. ఆ స్వార్ధపర శక్తుల కుయుక్తులను ఎండగట్టారు. ఆ విధంగా 'ఇస్లాం ఇన్‌ డేంజర్‌'  నినాదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటమేకాక, ఆవాంఛనీయ వాతావరణంలో కూడా ఎమాత్రం వెనుకంజవేయకుండా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవిశ్రాంత కృషి జరిపిన వారిలో మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని ప్రముఖులు.
    1929 జనవరి ఒకటిన మీరట్‌లో జరిగిన 'అహరర్‌' సంస్ధ ప్రాంతీయ సమావేశంలో మౌలానా మాట్లాడుతూ ఇస్లాం ప్రమాదంలో ఉందంటూ సాగుతున్న ప్రచారం వెనుక గల కుట్రను హేతుబద్దంగానూ, సాహసోపేతంగానూ వివరించారు.' ముస్లింలకు ప్రత్యేక దేశం' అను డిమాండ్‌ సరికాదన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, '...the cry for Islam in Danger is baseless and it could not be protected by Pakistan...Islam cannot be protected by any community but by our own strength and sacrifice...'' అన్నారు. పాకిస్ధాన్‌ ఏర్పడినంత మాత్రాన ఇస్లాం మతానికి ఒరిగేది ఏమీ ఉండదని ప్రకటించారు. అమాయక జనావళిని మభ్య పెట్టేందుకు ఇస్లాం ప్రమాదంలో ఉందని స్వార్దపర శక్తులు ప్రచారం చేస్తున్నాయంటూ, ఆయా శక్తుల ప్రభావానికి లోను కావద్దని ప్రజలు పిలుపునిచ్చారు.
    నమ్మిన విషయాలను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా, ఎటువంటి సదురుబెదురు లేకుండా ప్రకటించే మౌలానా హబీబుర్రెహమాన్‌ 1892 జూలై 3వ తేదీన పంజాబ్‌ రాష్ట్రం లూధియానాలో జన్మించారు. మౌలానా వంశీకులకు 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర ఉంది.  తండ్రి పేరు మౌలానా మహమ్మద్‌ జక్రియా. లూధియానా, జలంధర్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న హబీబుర్రెహమాన్‌ చివరకు దేవ్‌బంద్‌ వెళ్ళి ఉన్నత విద్యను పూర్తి చేశారు.
    1903లో లూధియానాకు చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ తత్వవేత్త మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ కుమార్తె బీబి షఫాతున్నీసాను వివాహమాడారు. ఆమె  భర్తతో పాటుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మౌలానా తన జీవితంలో మొత్తం మీద 10 సంవత్సరాలకు పైగా జైళ్ళల్లోనే గడిపారు. ఆయన ఆస్తిపాస్తులను అనేక సార్లు ప్రభుత్వం జప్తు చేసింది. పోలీసులు తనిఖీ పేరుతో మౌలానా గృహంపై పలు మార్లు దాడులు జరిపారు. ఆయన ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల కూడా అతి దారుణంగా వ్యవహరించారు. అయినా ఆ తల్లులు అన్నింటినీ సహించారు. చివరకు పసిపిల్లల చెవులలోని దుద్దులను కూడా అపహరించుకు పోయారు. ఎంత నష్టం జరిగినా శ్రీమతి షఫాతున్నీసా కష్టనష్టాలను కడుపులోనే దాచుకున్నారు. ఉత్తమ లక్ష్యం కోసం సాగుతున్న స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్న భర్త, బిడ్డలను ఆమె చివరివరకు ప్రోత్సహించారు. జప్తుల మూలంగా మౌలానా సర్వం కోల్పోయారు. చివరకు రోజుగడవటం కూడా లేని పరిస్ధితులలో శధిలావస్ధలో ఉన్న ఇంటిలోనే తలదాచుకుంటూ, మౌలానా దంపతులు తమ ఇరువురు కుమార్తెలతో పలు కడగండ్లను అనుభవించారు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా ఆ కుటుంబం పోరాట మార్గాన్ని, లక్ష్యాన్ని వీడలేదు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన యోధుల వంశానికి చెందిన మౌలానా రెహమాన్‌ తుదిశ్వాస వరకు ఆ ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కొనసాగించారు. బ్రిటిషర్ల రాజకీయాలను, దేశ ప్రజలను దోచుకుంటున్న తీరుతెన్నులను అవగతం చేసుకుంటూ పాలకుల చర్యలను వ్యతిరేకించారు. చక్కని శరీరాకృతి, వేషభాషలలో నవాబు దర్జాను ప్రతిబింబించే మౌలానా ఉదార హృదయులు. ఆదాయం పెద్దగా లేకున్నా, ఆదుకోమని వచ్చిన వారెవ్వరినీ కూడా వట్టి చేతులతో పోనివ్వని పెద్దమనస్సు అయనది.
    1919నాటి ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొనటం, భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన మౌలానా రెహమాన్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో  పలు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. 1921 డిసెంబరు 1న ఆయన చేసిన ప్రసంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడమని ప్రజలను ప్రేరేపించేదిగా ఉందంటూ బ్రిటిష్‌ పోలీసులు వారెంటు జారీ చేశారు.  ఆ వారెంటు ఫలితంగా 1922 డిసెంబరు 22న  తొలిసారిగా అరెస్టయ్యారు.  ఆరు మాసాల జైలు శిక్ష పడింది. ఈ విధంగా ప్రారంభమైన జైలు జీవితం మౌలానా జీవిత కాలాన్ని 15 శాతానికి పైగా హరించి వేసింది. పలు సార్లు శిక్షలు అనుభవించిన ఆయన మొత్తం మీద పది ఏండ్లకు పైగా దేశంలోని వివిధ జైళ్ళల్లో గడిపారు. ఆయన జైలు జీవితం గడపటమే కాక, విప్లవకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మీద ఆయనతనోపాటుగా ఆయన కుమారులను కూడా పలుమార్లు అరెస్టు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వం కారాగారంలో నిర్భందించింది.
    ఆధ్మాత్మిక విషయాలలో ముస్లింలకు మార్గదర్శకత్వం వహించే లక్ష్యంతో ఏర్పడిన JAMIAT-UL-ULEMA-HIND సంస్ధలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ సంస్థ జాతీయభావాలను ప్రచారం చేస్తూ, వేర్పాటు భావనలను నిరశిస్తూ, భారత జాతీయ కాంగ్రెస్‌కు బాసటగా నిలిచింది. జాతీయ భావాల ప్రచారం కోసం తన మిత్రులను ప్రోత్సహించి ANEES   అను ఉర్దూ పత్రికను లూధియానాలో మౌలానా ప్రారంభింపజేశారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సలహా మీద ఆయన 1920 లో MAJLIS-E-AHARAR ( The Society of Freemen) అను సంస్ధను ప్రారంభించారు. సంపూర్ణ స్వరాజ్య సాధనకు కృషి చేయటం, దేశ విభజన డిమాండ్‌ను వ్యతిరేకించటం, ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ప్రధాన లక్ష్యాలుగా అహరర్‌ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ కార్యకర్తలు జాతీయోద్యమంలో అసమాన త్యాగాలను, పోరాట పటిమను ప్రదర్శించారు. శాసనోల్లంఘనోద్యమంలో అరహర్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపర్చటం, ఉద్యమంలో భాగస్వాములు చేయడం,  ముందుకు నడిపించటంలో మౌలానా ఎంతో నేర్పుతో వ్యవహరించేవారు. అహరర్‌కు బలమైన కేంద్రాలుగా నున్న కాశ్మీర్‌, కపుర్తలా, బదవాల్‌ పూర్‌, ఖదియాన్‌లలో శాసనోల్లంఘన ఉద్యమం ఉదృతంగా సాగించారు.
    ప్రముఖ విప్లవకారుడు భగత్‌ సింగ్‌ అసెంబ్లీలో బాంబులు విసిరాక,  ప్రభుత్వ దమనకాండకు భయపడి ఆయన కుటుంబీకులకు ఆశ్రయం కల్పించేందుకు పంజాబ్‌ ప్రజలు ఎవ్వరూ కూడా ముందుకు రాని భయానక వాతావరణంలో భగత్‌ సింగ్‌ కుటుంబీకులకు నెల రోజులపాటు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీచేయగా, ఆ అరెస్టును తప్పించుకోడానికి అజ్ఞాతంలోకి వెళ్ళిన సుభాష్‌ చంద్రబోస్‌కు కూడా ఆనాడు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. పంజాబ్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వ దాష్టికాలకు అంతూపొంతూ లేకున్న వాతావరణంలో బోస్‌కు ఎక్కడా తలదాచుకోడానికి అవకాశం లభించలేదు. ఆజ్ఞాతంలో ఉన్న ఆయన పంజాబ్‌లోని లుధియానాకు వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న మౌలానా లుధియాని స్వయంగా సుభాష్‌ ను ఆహ్వానించి బ్రిటిష్‌ పోలీసుల కళ్ళుగప్పి ఆశ్రయమిచ్చారు. మౌలానా ఇంట వారం రోజులు గడిపిన బోస్‌ తిరిగి బెంగాల్‌ వెళ్పిపోయారు.(The Milli Gazette, Fortnightly Feb.16-28, 2013, Page No.23). ఈ విధంగా ఇతరులెవ్వరూ విప్లవకారులకు, జాతీయోద్యమకారులకు ఆశ్రయం, రక్షణ కల్పించడానికి ముందుకు రాని రోజుల్లో మౌలానా హబీబుర్రెహమాన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఏమాత్రం భయపడకుండా సహచరులైన స్వాతంత్య్రసమరయోధులను ఆదుకున్నారు.
     1931లో మూడు వందల మంది ఆంగ్ల ప్రభుత్వ పోలీసు అధికారులు, పోలీసుల సమక్షంలో నిర్భయంగా లుధియానలోని ఐనీబినీరి అబిళీబి ఖబిరీశీరిఖి వద్ద భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకావిష్కరణ గావించి మౌలానా ఆర్టెయ్యారు. భారత విభనన లక్ష్యంగా ప్రజలలో మతం పేరిట మానశిక విభనను తీసుకరావడం ప్రధాన బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులు, విభజనకారులు లుధియానా రైల్వే స్టేషన్‌లో 'హిందూ వాటర్‌' 'ముస్లిం వాటర్‌' అంటూ రెండు వేర్వేరుగా మంచినీటి కుండలు ఏర్పాటుచేశారు. ఈ  ఏర్పాటు గురించి తెలుసుకున్న మౌలానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చర్యను తీవ్రగా నిరసిస్తూ జాతీయోద్యమకారులు, వేర్పాటువాదాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న తన సహచరులు, అనుచరులైన హిందూ-ముస్లిం-సిక్కు సోదరులను కలుపుకుని తాను స్వయంగా రైల్వేస్టేషన్‌ వెళ్ళి అక్కడ ప్రభుత్వాధికారులు ఏర్పాటు చేసిన ఆ వేర్వేరు మంచి నీటి కుండలను పగులగొట్టి ఆరెస్టుకు గురయ్యారు.
    భారత జాతీయ కాంగ్రెస్‌ బాటన నడిచినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలన్నింటినీ మౌలానా సమర్థించ లేదు.  ఆయా నిర్ణయాలను విశ్లేషించుకుని సమర్దించటం లేదా నిశితంగా విమర్శించటం అయన ప్రత్యేకత. విమర్శించటంలో ఆయన  ఎంతటివారైనా ఖాతరు చేసేవారు కారు. 1937లో జాతీయ కాంగ్రెస్‌ పంజాబ్‌లో అనుసరించిన విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహత్మా గాంధీని కూడా ఆయన ఎమాత్రం ఉపేక్షించలేదు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ తారాచంద్‌ ప్రస్తావిస్తూ ,  'Even loyalty to the Congress, unswerving faith in the leadership of Ganghiji and deep attachment to  Jawaharlal Nehru could not deter him from differing from them, speaking to them firmly and warning them of the evil consequences of what he consider to be wrong decisions.' అన్నారు. పంజాబ్‌లో సిక్కులను సంతృప్తి పర్చేందుకు  నెహ్రూ నివేదికను పరిగణలోనికి తీసుకోలేదని గాంధీజీని ఆయన చాలా నిశితంగా విమర్శించారు.  హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్యన శాంతి-సామరస్యాలకు, ఐక్యతకు తగినంత వాతావరణం సృష్టించకుండానే, గాంధీజీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్ళారని మౌలానా విమర్శించారు.   
     సమాజంలోని ధనిక-పేద వర్గాల మధ్య నున్న అంతరాల గురించి మౌలానా ఆలోచించేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వం సాగించిన జప్తుల వలన సర్వం కొల్పోయినా,  తనకున్న తానితో ఆశ్రితులను సంత్పప్తి పర్చుతూ, ప్రజలు ఈ దుస్థితి నుండి శాశ్వితంగా బయట పడాలని కోరుకున్నారు.  ఆర్దిక సమానత్వం సాధించటం ద్వారా మాత్రమే అన్ని రకాల అసమానతలను సమాప్తం చేయవచ్చన్నారు. సామ్యవాద వ్యవస్ద నిర్మించటం కోసం కృషి సల్పాలని కోరారు. ప్రస్తుత భారతీయ సమాజం ఎదుర్కోంటున్న రుగ్మతలకు సామ్యవాద సిద్ధాతం మాత్రమే ఔషధమని విశ్వసించారు. ఆసమానతలను అంతంచేసే సామ్యవాద వ్యవస్ధ నిర్మాణం కోసం రాజకీయ పార్టీలు పని చేయాలని ఆకాంక్షించారు. ధనికుల పెత్తనం సాగుతున్న ప్రస్తుత ఆంగ్ల ప్రభుత్వాన్ని నిర్మూలించాలన్నది తన ధ్యేయమని మౌలానా ప్రకటించారు. సామ్యవాద వ్యవస్ధ అభిమానించిన ఆయన కమ్యూనిస్టు పార్టీలో మాత్రం చేరలేదు.  ఇస్లాం మతం మూల సూత్రాలను ఎంతో శ్రద్ధతో పాటించే, మతాచారపరాయణుడైన మౌలానా సామాజిక సమస్యల పరిష్కారానికి మతాతీతంగా ఆలోచించారు.  1940లో జరిగిన ఆజాద్‌ ముస్లింల సమావేశంలో భారత విభజన, హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించి తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించారు. భారత విభజనను వ్యతిరేకిస్తూ తయారైన ప్రతిపాదన తీర్మానంగా రూపుధరించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు.
    జీవితపర్యంతం జాతీయవాదిగా కొనసాగిన మౌలానా నమ్మిన సిద్దాంతాల పట్ల నిబద్దతతో  నిలిచారు.  స్వజనుల నుండి, విమర్శలు వచ్చినా చలించలేదు. ఆయన నిర్మోహమాటి కావటంతో పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.  జయాపజయాలను లెక్కచేయకుండా ఓర్పు, సహనంతో సర్వం కొల్పోయినా ముందుకు సాగారు. భారత విభజన పరిణామాల ఫలితంగా, ఆ మహనీయుని కుటుంబం  శరణార్దుల శిబిరంలో శరణు పొందాల్సి వచ్చింది. పుట్టిపెరిగిన లూధియానాను పదలాల్సి వచ్చింది. చివరకు ఢిల్లీ వెళ్ళి అపరిచితుల గృహంలో తలదాచుకోవాల్పి వచ్చింది.ఈ దుష్పరిణామాలకు కలత చెందిన మౌలానా భార్య షఫాతున్నిసా ఎంతో కృంగిపోయారు.  '..ఇందుకోసమేనా? ..మనం అన్ని కష్టనష్టాలకోర్చింది? ఏమిటిదంతా?...మనం మన ఇంటికి ఎప్పుడు పొందాం? మన లూధియానకు ఎప్పుడు వెళ్ళిపోదాం...' అంటూ పదే పదే ప్రశ్నించే సతీమణిని ఓదార్చలేక ఆయన సతమతమై పోయారు. ఆనాటి చేదు జ్ఞాపకాలు మౌలానా హబీబుర్రెహమాన్‌ను చివరికంటా వెంటాడుతూనే ఉండిపోయాయి. చివరకు  ' His devotion to principle such as martyrs might envy.  He never deviated from his beliefs and stood by them firm as rock. He is a man of amazing courage and endurance.'  అంటూ శ్రీ తారాచంద్‌చే ప్రశంసలు పొందిన మౌలానా హబీబుర్రెహామాన్‌ 1956 సెప్టెంబర్‌ 2న కన్నుమూశారు.
===
From Syed Naseer Ahamed,

Friday, 30 August 2013

అష్ఫాఖుల్లా ఖాన్‌-రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్నేహబంధం

అపూర్వం -ఆదర్శనీయం   అష్ఫాఖ్‌-బిస్మిల్‌ల  స్నేహబంధంభారత జాతీయోద్యమ చరిత్రలోని 'అగ్నియుగం' నాటి విప్లవ పోరాటయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌ల మధ్య ఏర్పడిన స్నేహబంధం ఎంతో త్యాగపూరితమైంది. రాంప్రసాద్‌ బిస్మల్‌ 'హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌' నాయకుడు. అష్ఫాఖ్‌ ఖాన్‌ బిస్మిల్‌ ఆయన సహచరుడు. అష్ఫాఖ్‌ ఇస్లాం ధర్మానురక్తుడు. మతం మారిని వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న వ్యక్తి రాంప్రసాద్‌ బిస్మిల్‌ అర్యసమాజీకుడు. మత ధర్మాలను బట్టి అష్ఫాక్‌-బిస్మిల్‌ల ధార్మిక బాటలు వేర్వేరుగా ఉన్నా బ్రిటీష్‌ పాలకుల కబంద హస్తాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న తిరుగులేని వారి సంకల్పం ఆ ఇరువురి బాటను ఏకం చేసింది. ఆ విధంగా ఏర్పడిన వారిరువురి స్నేహబంధం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అద్వితీయంగా వెలుగొంది ఆనాటికి - ఈనాటికి ఆదర్శనీయంగా నిలచింది.   ఈ స్నేహబంధం ఆనాడు ఎంత సంచలనం సృష్టించిందో, ఈ యోధుల గురించి బంధుమిత్రులు ఏమనుకున్నారో బిస్మిల్‌ స్వయంగా తన ఆత్మకథలో, 'ఒక పచ్చి ఆర్యసమాజికునికి, ఒక ముస్లిముకు మధ్య యిలా స్నేహం ఎలా కలిసింది? అని అంతా ముక్కుపై వేలేసుకునే వాళ్ళు. నేను ముహమ్మదీయులను శుద్ధి (హిందువులుగా మార్పిడి) చేస్తుండేవాడిని. ఆర్యసమాజ మందిరంలోనే నా నివాసం ఉండేది. కాని నీవీ విషయాలను వేటినీ కించిత్తయినా లేక్కచేయలేదు. నీవు ముహమ్మదీయుడివి కావడం చేత నా మిత్రులు కొందరు నిన్ను తిరస్కారభావంతో చూస్తుండేవారు. కానీ నీవు ధృఢ నిశ్చయంతో నిలిచావు. నన్ను కలుసుకోవడానికి నీవు ఆర్యసమాజ మందిరానికి వచ్చిపోతుండేవాడివి. హిందూ-ముస్లింల కలహాలు చెల రేగినప్పుడు విూ పేటలో అందరూ నిన్ను బాహటంగా దూషించేవారు. కానీ నీ వెప్పుడూ వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేదు', అని రాసుకున్నాడు. మాతృభూమి విముక్తికి సంబంధించిన అంశం ప్రధాన మైనప్పుడు హిందువైనా, ముస్లిమైనా ఒకే రకంగా స్పందిస్తారని, ఒకే రకంగా త్యాగాలకు సిద్ధపడతారని, ఈ సంసిద్ధత, త్యాగాలకు మతం ఏమాత్రం అడ్డంకి కానేరదని అష్ఫాఖ్‌ తన అపూర్వర నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో సాక్ష్యం పలికారు. 'చివరకు హిందువులు ముస్లిం లలో ఏదో తేడా ఉందనే ఆలోచనే నా హృదయం నుండి నిష్క్రమించ సాగింది. నీవు నా విూద ప్రగాఢ విశ్వాసం, అమిత ప్రీతి కలిగి ఉండే వాడివి', అని సనాతన సంప్రదాయానురక్తుడు, శుద్ధి సంఘం నేత రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్వయంగా అష్ఫాఖుల్లా గురించి రాసుకున్నారు. ఈ స్నేఅపూర్వ హం రాంప్రసాద్‌ బిస్మిల్‌ కోసం ప్రాణత్యాగానికి కూడా అష్ఫాఖుల్లాను పురికొల్పింది. జాతీయోద్యమ చరిత్రలో ఉత్తేజ పూరితమైన 'కాకోరి రైలు సంఘటన' బిస్మిల్‌ నాయకత్వంలో జరిగింది. ఈ సంఘటనలో పాల్గొనడం అష్ఫాఖుల్లా ఖాన్‌కు ఇష్టం లేదు. బాల్య థలో ఉన్న విప్లవోద్యమానికి ఇది గొడ్డలిపెట్టు కాగలదని ఆయన తన సహచరులకు, నాయకుడు బిస్మిల్‌కు నచ్చచెప్పేందుకు విఫల ప్రయత్నం చేశాడు. అత్యధికుల అభిప్రాయాన్ని గౌరవించే ప్రజాస్వామిక వాది అఫ్ఫాఖుల్లా చివరకు ఉమ్మడి నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. ఆ తరువాత జరిగిన కాకొరి రైలు సంఘటనలో ఆయన ప్రధాన పాత్రవహించాడు.ఈ సంఘటనలో పాల్గొన్న వారిలో అష్ఫాఖుల్లా తప్ప మిగిలిన వారంతా వెంటనే పోలీసులకు పట్టుబడగా, ఆఫ్ఫాఖ్‌ మాత్రం బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి చాలా కాలం తరువాత అరెస్టు అయ్యాడు. అపాటికి ఈ కేసులో విప్లవకారుందరికి కఠిన శిక్షలను విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి. ఆ తరువాత అందరి అప్పీళ్ళ తిరస్కరించబడి, పలు రకాల శిక్షలు ఖరారయ్యాయి. లండన్‌ లోని ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవడం మాత్రమే చివరకు మిగిలింది.   ఆ థలో అరెస్టయిన అష్ఫాఖుల్లా ఖాన్‌ తన ఆప్తమిత్రుడు, 'హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌' నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను ఉరిశిక్ష నుండి తప్పించ బూనుకున్నాడు. న్యాయవాదులతో సంప్రదించాడు. మిత్రుడితో మాట్లాడాడు. చివరకు నేరాన్ని మొత్తంగా తాను స్వీకరిస్తే బిస్మిల్‌ను కాపాడవచ్చని అభిప్రాయానికి వచ్చాడు. మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న విప్లవకారులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పీలు చేసుకోవడం, క్షమాబిక్ష యాచించడం సరికాదన్నది అష్ఫాఖ్‌ అభిప్రాయం.ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేయడం అష్ఫాక్‌కు ఇష్టం లేకున్నా స్నేహితుడు  బిస్మిల్‌ కోరిక మేరకు సరేనన్నాడు. ఆ మేరకు కాకోరి రైలు సంఘటనకు తానే పూర్తిగా బాధ్యుడనని వివరిస్తూ, నేరాన్ని మొత్తాన్ని తన నెత్తిన వేసుకుంటూ ప్రీవికౌన్సిల్‌కు సమర్పించేందుకు అష్ఫాఖుల్లా ఖాన్‌ ప్రకటన పత్రం తయారు చేశాడు. ఆ అభ్యర్థన పత్రం చూసిన ఆయన న్యాయవాది కృపాశంకర్‌ హజేలా కంగారు పడిపోతూ ఆ విధంగా ప్రకటన చేసినట్టయితే ఆయనకు ఉరిశిక్ష ఖాయమని హెచ్చరించినా అష్ఫాఖ్‌ వినలేదు. మిత్రుడు, విప్లవోద్యమ నేత బిస్మిల్‌ కోసం బలికావడానికి సిద్ధపడిన ఆయన న్యాయవాది కృపాశంకర్‌ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆ వినతి పత్రాన్ని నేరుగా ప్రీవీకౌన్సిల్‌కు పంపుతూ, చారిత్రాత్మక కాకోరి రైలు సంఘటన నేరభారాన్ని, ఆ నేర బాధ్యతను పూర్తిగా తాను స్వీకరిస్తూ ఒప్పుకోలు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తన న్యాయవాదికి మరింత వివరణ ఇస్తూ, 'ఈ మార్గం కంటక ప్రాయమైనప్పటికి, ఈనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఇక నేరం అంగీ కరించటం అంటారా? నా వరకు నేను నేరం అంగీకరించడానికి సిద్ధమే కాదు, అందరి నేరాలను నా నెత్తిన వేసుకోడానికి కూడా సిద్ధం,' అని కాకోరి రైలు సంఘటన నేరభారాన్నీ పూర్తిగా అష్ఫాఖుల్లా ఖాన్‌ తన నెత్తిన వేసుకున్నాడు. ఆ నేర ఒప్పుకోలు పత్రం  పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది కృపాశంకర్‌ హజేలాతో అష్ఫాఖ్‌ మాట్లాడుతూ మిత్రుడి మంచిని  సర్వదా కోరుకునే స్నేహితుడిగా, నాయకుడి క్షేమాన్ని నిరంతరం ఆకాంక్షించే కార్యకర్తగా, విప్లవోద్యమం పట్ల నిజాయితి, నిబద్దత గల విప్లవకారుడిగా, వలస పాలకుల నుండి మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడిగా అఫ్ఫాఖ్‌ పలికిన పలుకులు ఈనాటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.  అష్ఫాఖుల్లా ఖాన్‌ తన న్యాయవాదితో మాట్లాడుతూ, 'నేను ఎల్లప్పుడు సిపాయిని మాత్రమే. శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ మా నాయకుడు.  ఆయన నిష్టగల దేశభక్తుడు. మంచి తెలివితేటలు గల వ్యక్తి. నా ప్రాణాలు ఆడ్డువేసి ఆయనను రక్షించుకోగలిగితే అది మా పార్టీకి, మా లక్ష్యాల సాధనకు ఎంతో మంచిదౌతుంది. నేను సిపాయిని మాత్రమే. ఆయన ఆలోచనలు తీరుతెన్నుల విషయంలో నేను ఆయనతో సరితూగలేను. ఆందువలన ఆయనను రక్షించుకోవాల్సి ఉంది ... భారత జాతీయ కాంగ్రెస్‌ ఎలాగైతే లక్ష్యసాధనకు తన మార్గాన్ని నిర్దేశించుకుందో అలాగే మేమూ దేశ స్వాతంత్య్రం కోసం మా మార్గాన్ని ఏర్పచు కున్నాం. అని అన్నాడు. అష్ఫాఖుల్లా ఖాన్‌ నిర్బంధంలో ఉన్నప్పుడు మతం ఆసరాతో అతడ్ని తమవైపు తిప్పుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎన్నో విధాలుగా మభ్యపెట్టారు. 'రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఒక హిందువు. ఆర్య సమాజీకుడు. దేశంలో హిందూ రాజ్యం నెలకొల్పడం వాళ్ళ ధ్యేయం. అది ముస్లింల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్దమైనది. ఒక ముస్లింగా నీవు వారి మతతత్వాన్ని నిరసించి, ప్రభుత్వంతో సహకరించు, కాఫిర్లతో సహకరించడం మన మత సంప్రదాయాలకు పూర్తిగా విరుద్దం కాబట్టి ఒప్పుదల వాంగ్మూలం ఇచ్చి నీ ప్రాణాలను, అలాగే నీ మతం ప్రయోజనాలను కాపాడుకో', అంటూ ఆయనను తమ మార్గంలోకి తెచ్చుకునేందుకు చాలాసార్లు విఫలప్రయత్నాలు చేశారు.  అష్ఫాఖుల్లాను ఏలాగైనా లొంగదీసుకోవాలనుకున్న ఆ పోలీసు అధికారి మరింత తెలివిగా మాట్లాడుతూ, 'ఇదంతా హిందువుల కుట్ర. రాంప్రసాద్‌ బిస్మిల్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడు. విూరు ముస్లిం అయిఉండి ఎలా మోసపోయారు?' అంటూ మతపరమైన ప్రశ్నలను సంధించాడు. ఆ ప్రశ్న, ఆ ప్రశ్నలోని విభజించి-పాలించు కుతంత్రం, అందులోని కుట్రను గ్రహించిన అష్ఫాఖ్‌  పోలీసు ఆధికారికి సూటిగా సమాధానమిస్తూ, 'రాంప్రసాద్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడన్న విషయం అబద్దం. ఒకవేళ అది నిజమైతే, బ్రిటీష్‌ రాజ్యం కంటే హిందూ రాజ్యం మేలు కదా', అని అన్నాడు. అంతటితో ఆగకుండా ఈ కేసులో 'నేనొక్కడినే ముస్లిం కావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. నేను ఏదైనా పొరపాటు చేశానా? ఆది ప్రధానంగా ముస్లింల విూద మా పఠాన్‌ జాతి జనుల విూద మాయని మచ్చగా మిగిలి పోతుంది. కనుక నన్ను గౌరవప్రదంగా మరణించనివ్వండి' అని స్పష్టం చేస్తూ అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు, చివరకు ఉరిశిక్షకు సిద్ధమయ్యాడు.   ఈ విధంగా అష్ఫాఖుల్లా ఖాన్‌ ఆదర్శప్రాయమైన స్నేహ బంధాన్ని, సమరయోధుని ధర్మాన్ని ప్రదర్శించాడు.  మహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు ఏర్పడిన మిత్రత్వం జాతి, మత, కుల ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని ఆచరణాత్మకంగా రుజువు చేశాడు. ఈ ఇరువురిని వారి మిత్రులు, బంధువులు మతభ్రష్ఠులుగా నిందించారు. ఈ సందర్భంగా బిస్మిల్‌ను ఆయన స్నేహితులు హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలను బిస్మిల్‌  ప్రస్తావిస్తూ, 'మా బృందంలో తరచూ నీ గురించి చర్చ వచ్చేది. ఏమో నమ్ముతున్నావు ... మోసపోయేవు సుమా అని అనేవాళ్ళు ... కానీ నీవు నెగ్గావు', అని బిస్మిల్‌  అత్మకథలో అష్ఫాఖ్‌లోని నికార్సయిన నిజాయితీని స్వయంగా ప్రకటించాడు.  ఈ విషయాన్ని బిస్మిల్‌ మరింతతగా సుదృఢంచేస్తూ, 'నేను నీవు అనే తేడా లేకుండా పోయింది మన మధ్య, తరచూ నీవూ నేను ఒకే కంచంలో తిన్నాము', అన్నాడు. చివరివరకు మతాలకు అతీతంగా వ్యవహరించిన అష్ఫాక్‌-బిస్మిల్‌ మిత్రద్వయం మాతృభూమి విముక్తి పోరాటంలో కలసి మెలసి పాల్గొనటం మాత్రమే కాకుండా కంటక ప్రాయమైన ఆ మార్గంలో ఎదురైన అన్ని కష్ట నష్టాలతోపాటు చివరకు ఉరిశిక్షలను కూడా సంతోషంగా స్వీకరించి చిరస్మరణీయులయ్యారు. చివరి రోజుల్లో కూడా మత ప్రసక్తి లేకుండా భారతీయులంతా కలసిమెలసి ఉండాల్సిందిగా అష్ఫాఖుల్లా ఖాన్‌ ప్రజలను కోరారు. 1927 డిసెంబరు 19న ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాదు జైలులో ఉరి తీస్తారనగా, డిసెంబరు 16న  జైలు నుండి దేశవాసులను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశాడు.  ఆ లేఖలో, 'భారతదేశ సోదరులారా మీరు ఏ మతానికి, సంప్రదాయానికి చెందిన వారైనా సరే, దేశసేవలో కృషిచేయండి. వృధాగా పరస్పరం కలహించకండి. అన్ని పనులూ ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు సాధనాలు. అలాంటప్పుడు ఈ వ్యర్థపు కోట్లాటలూ, కుమ్ములాటలు ఎందుకు? ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్ని ఎదిరించండి. దేశాన్ని స్వతంత్రం చేయం ... చివరగా అందరికి నా సలాం. భారతదేశం స్వతంత్రమగుగాక. నా సోదరులు సుఖంగా ఉందురు గాక',  అంటూ  తన ఆకాంక్షను వ్యక్తంచేస్తూ ఆ అష్ఫాఖుల్లా ఖాన్‌ చారిత్రకమైన లేఖను ముగించాడు.

Monday, 11 March 2013

గాంధీజీ పిలుపుకు తొలుతగా స్పందించిన ఆంధ్రుడు
మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌
(1882-1973)

        సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా  ఆంగ్ల ప్రభుత్వం ప్రసాదించిన పదవులను, ఉద్యోగాలను, బిరుదులను త్యజించాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు రాష్ట్రం నుండి తొలుతగా స్పందించిన యోధుడు మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌. కృష్ణా జిల్లా విజయవాడలోని సంపన్న జాగీద్దార్‌ కుటుంబంలో ఆయన 1882లో జన్మించారు. చిన్నతనం నుండి సేవాభావాన్ని అలవర్చుకున్న ఆయన అవసరార్ధుల మన్నన పొందారు. నిడారంబర జీవితాన్ని ఇష్టపడినఆయన జాగీద్దారిని కూడా పరిత్యజించారు. 
    గులాం మొహిద్దీన్‌ ఇటు భారత జాతీయ కాంగ్రెస్‌, అటు అఖిల భారత ముస్లింలీగ్‌లో సభ్యత్వం స్వీకరించారు. 1919లో ఆరంభమైన సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా ఆంగ్ల ప్రభుత్వం అందచేసిన పదవులును వదులుకోవాల్సిందిగా మహాత్ముడు కోరారు. గులాం మొహిద్దీన్‌ తక్షణమే ఆ పిలుపుకు స్పందిస్తూ తాను నిర్వహిస్తున్న గౌరవ మేజిస్ట్రేటు పదవికి రాజీనామా చేసి, ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చిన పదవిని త్యజించిన తొలి ఆంధ్రుడయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ స్వాతంత్య్రసమరయోదులు అయ్యదేవర కాళేశ్వరరావు పేర్కొంటూ, నా ముఖ్య మిత్రులైన మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబుగారు మొదటి తరగతి గౌరవ మేజిస్ట్రేటుగ నుండిరి. నాతోపాటుగా తాను కూడా గౌరవ ఉద్యోగము వదలు కొనెదమని ప్రకటించిరి. అప్పుడు శ్రీమాన్‌ చక్రవర్తి రాజగోపాలచారి గారు కూడా యుండిరి. ఆంధ్ర దేశములో మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ దౌర్జన్యరహిత సహాయ నిరాకరణోద్యమము ననుసరించి శాసనసభ అభ్యర్థిత్వమును, మొదటి తరగతి గౌరవ మెజిస్ట్రేట్‌ పదవిని వదలుకొన్నవారము అప్పటికి మేమిద్దరమే. ఈ సంగతి గాంధీగారు ఆ సభలో గుమికూడిన వేలాది ప్రజల ముందు కరతాళధ్వనుల మధ్య ప్రకటించిరి. తమ 'యంగ్‌ ఇండియా' పత్రికలో కూడా వ్రాసిరి, అని పేర్కొన్నారు. (నా జీవిత కథ (నవ్యాంధ్రము), అయ్యదేవర కాళేశ్వరావు, పేజీ.291)
    మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ విజయవాడ ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమ కమిటికీ అధ్యకక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. సన్నిహిత మిత్రుడు అయ్యదేవరతో కలసి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.1921లో విజయవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు సంకల్పించిన ఆయన పట్టుబట్టి, అయ్యదేవరతో కలసి కలకత్తా వెళ్ళి సమావేశాల నిర్వహణకు మహాత్ముడి అనుమతి పొందారు. ఈ సమావేశాలలో మహాత్మాగాంధీ, అబ్బాస్‌ తయాబ్జీ, హాకీం అజ్మల్‌ఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ తదితర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సమావేశాల కోసం మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబ్‌ తన ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. 

    ఈ విషయాన్ని అయ్యదేవర గాంధీజీకి తెలుపుతూ గులాం మొహద్దీన్‌ కాంగ్రెస్‌కు ఎంతో ఆర్ధిక సహాయం చేశారనగా, ఆ మాటకు మొహిద్దీన్‌ వెంటనే స్పందిస్తూ, తాను కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేయలేదనడంతో అక్కడున్న నాయకులు ఆశ్చర్యపడ్డారట. అంతలోనే, తన సంపదను తాను దేశం కోసం మాత్రమే వ్యయం చేశానని మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ చెప్పడంతో నేతలంతా ఆనందిస్తూ గులాం సాహెబ్‌ను ఆనందించారట. ఆయన వితరణ, ఆతిథ్యాన్ని మరువని గాంధీజీ విజయవాడ నుండి ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా మొహిద్దీన్‌ సాబ్‌ ఏలా ఉన్నారు? అని ఆయన క్షేమసమాచారాలను కనుక్కొనేవారట. (ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, చరిత్రకారుడు యల్‌.వి.రమణ (విజయవాడ) కథనం).
    1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు. స్వయంగా గుర్రం మీద విజయవాడలోని వీధుల్లో తిరుగుతూ శాంతంగా, సామరస్యంగా ఉండమని అన్ని మతాల ప్రజానీకాన్ని కోరుతూ మత సామరస్యానికి విశేష కృషి సల్పారు. విజయవాడ పురపాలక సంఘం కౌన్సిలర్‌గా, ఉపాధ్యకక్షునిగా చాలా కాలం బాధ్యతలు నిర్వహించారు. చివరివరకు చలువ ఖద్దరు ధరించిన ఆయన 1973 మార్చి 13న విజయవాడలో 91వ ఏట కన్నుమూశారు.

Thursday, 10 May 2012

సంపూర్ణ స్వరాజ్యం కై తొలి కేక వేసిన పోరాట యోధుడు మౌలానా హస్రత్‌ మోహాని

సంపూర్ణ స్వరాజ్యం కై తొలి కేక వేసిన పోరాట యోధుడు
మౌలానా హస్రత్‌ మోహాని
    భారత జాతీయ కాంగ్రెస్‌ 14న సమావేశం డిసెంబరు 1921న అహ్మదాబాద్‌ లో జరుగుతుంది.  ఆ సమావేశంలో ఓ వ్యక్తి గంభీరంగా ఉపన్యసిస్తున్నాడు. అతని ప్రసంగం యువకుల్నే కాదు, పెద్దల్ని కూడా పెను తుఫానులా చుట్టేస్తుంది. ఆ ప్రసంగంలో వ్యక్తమవుతున్న పట్టుదల, లక్ష్యం పట్ల గల నిభద్దతకు సభికులు ఆనంద పరవశులవుతున్నారు. ఆ ప్రసంగానికి సభాస్దలి యావత్తు కదలిపోతుంది. ప్రతిపాదిత ' స్వరాజ్యం ' డిమాండ్‌ను  ఆ వక్త  కోరుతున్నటుగా ' సంపూర్ణ స్వరాజ్యం ' గా సవరించబడి ఏకగ్రీవంగా తీర్మానించాలని ప్రతి ఒక్కరూ భావించారు. చివరకు అది తీర్మానం కాలేదు.
    భారత రాజకీయ రంగాన తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న మహాత్మా గాంధీ ఆ సవరణను వ్యతిరేకించటం వలన అది అప్పటికి వీగిపోయింది.' .. this proposition of Mr.Hasarth Mohani leads you into depths unfathomable.. ' అంటూ సవరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సమావేశం సానుకూలత సాధించేందుకు గాంధీజీ సుదీర్ఘ ప్రసంగం చేయాల్సి వచ్చింది.  జాతీయోద్యమంలో ఈ డిమాండ్‌ ను ప్రప్రధమంగా ఒక రాజకీయ వేదిక మీద ప్రకటించిన తొలి  ఉద్యమకారుడిగా  ఖ్యాతిగాంచాడా వక్త.  ఆ వక్త మరెవరో కాదు, భారత స్వాతంత్య్రోమ చరిత్రలో ' చిచ్చర పిడుగు ' గా ఖ్యాతి గాంచిన మౌలానా హస్రత్‌ మోహాని. స్వాతంత్య్ర పోరాటంలో తనదైన విప్లవాత్మక శైలితో బ్రిటీషర్లను ఎదుర్కొంటూ భారతీయుల హృదయాల్లో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యోధుడాయన.
    స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మౌలానా మోహాని 1878 లో ఉత్తర ప్రదేశ్‌ లోని ' మోహన్‌ ' అను  పట్టణంలో జన్మించాడు. ఆయన అసలు పేరు సయ్యద్‌ ఫజులుల్‌ హసన్‌. హాస్రత్‌ ఆయన కలం పేరు. మోహన్‌ అను పట్టణం నుండి వచ్చినందున  జన్మస్థానం పేరును  కలుపుకుని  ' హాస్రత్‌  మోహాని ' ఆయ్యాడు.  అలీఘర్‌ డిగ్రీ కళాశాలలో బి.ఎ చేసాడు. చిన్నతనం నుండే సాహిత్యాభిలాషి.    పదిహేడవ ఏటనే మోహాని గజల్స్‌ రాయటం ప్రారంభించాడు. ' ఉర్దూ-యే-ముల్లా '   పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. అరవింద ఘోష్‌ , బాల గంగాధర తిలక్‌ల  విప్లవాత్మక భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తి కాగానే పరులచెంత నౌకరుగా చాకిరి చేయటం ఇష్టంలేని మోహాని జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాడు.         బానిసత్వాన్ని ఏ రూపంలోనూ సహించని  మోహాని బ్రిటీషర్ల పై పోరు సలిపేందుకు, 1903లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. 1907 లో అతివాదులు, మితవాదులుగా కాంగ్రెస్‌ చీలిప్పుడు  ఆయన తిలక్‌ బాటను అనుసరించాడు.
    విప్లవాత్మక భావాలతో బ్రిటీష్‌ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ ఆయన పత్రికలో వ్యాసాలు రాసి, ప్రచురించిన కారణంగా 1909 లో ప్రభుత్వం  రాజద్రోహం నేరం మోపి, రెండు  సంవత్సరాల జైలు, ఐదు వందల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోవటం వలన ఆయన సమకూర్చుకున్న అమూల్య గ్రంధాలను జప్తుచేసి పోలీసులు పట్టుకెళ్ళారు. జైలు నుండి విడుదల కాగానే, ఒక మిత్రుని ఆర్ధిక సహకారంతో భారత దేశం లోని ప్రధమ ' స్వదేశీ స్టోర్స్‌ ' ను భార్య శ్రీమతి నిషాతున్నిసా బేగం సహాయంతో ప్రారంభించారు. బేగం హస్రత్‌ మోహాని గా విఖ్యాతురాలైనా ఆమె స్వాతంత్య్ర సమరంలో అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించటమే కాక, అన్ని వేళల్లో భర్తకు తోడూ-నీడగా నిలిచిన యోధురాలు. విదేశీ వస్తువుల బహిష్కరణను ప్రోత్సహించటమే కాక స్వదేశీ వస్తువుల తయారీదారులకు కూడా అన్ని విథాల సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. బానిసత్వం నుండి విముక్తికై పోరాట స్పూర్తి కలుగజేసేందుకు దేశభక్తి భావనల ప్రచారానికౖెె ' తజకర-యే- షురా ' (ఊబిచిదిబిజీబి-రి-ఐనీతిజీబి)  అను త్త్రెమాసిక పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక లో తనదైన శైలిలో ఎక్కడా రాజీ పడకుండా తెల్లదొరల పాలనను విమర్శించటమేకాక విదేశీ పాలకులను ఎందుకు తరిమి కొట్టాలో విశ్లేషించి  ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యాడు ' British people in Egypt ' అను వ్యాసాన్ని ప్రచురించినందుకు ఆయన పై మళ్ళీ రాజద్రోహం నేరం మోపిన ప్రభుత్వం విచారణ జరిపించి నాలుగు సంవత్సరాల జైలు శిక్షను విధింపజేసింది.
    కాబూల్‌ కేంద్రంగా ఏర్పడిన ప్రవాస భారత ప్రభుత్వం పిలుపు మేరకు , మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తో కలసి కాబూల్‌ కు వెడుతున్నాడన్న నెపం మీద 1916లో ఆయనను ప్రభుత్వం గృహ నిర్భంధ శిక్షను విధించగా,  ఆయన  ఉల్లంఘించాడు.  అందుకు గాను ఆయన  మరోసారి 2 సంవత్సరాల జైలు శక్షకు గురయ్యాడు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని,  '..మోహాని కృషికి తగిన బహుమతి అందింది...మోహాని ఎందుకు అరెస్టు అయ్యాడో 50 సంవత్సరాల తరువాత ఈ దేశం సరిగ్గా అర్థం చేసుకుంటుంది..' అని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రశంసించారు. ఆయనను అతి ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించిన ప్రభుత్వం జైలులో అనేక రకాలైన ఇబ్బందుల పాల్జేసింది. కష్టనష్టాలకు గురిచేసింది. విలువైన పుస్తకాలను తగులపెట్టించింది  మౌలానా స్వయంగా ఆ సంఘటనలను ఈ విధంగా పేర్కొన్నారు. .' .' ..The superintendent of jail came to my cell. He burnt to ashes all of my newspapers, magazines and books, including Diwan-e-Hafiz and ordered me indignantly to present myself in his office.. '  ప్రభుత్వం ఎతం పీడించినా, మౌలానా మాత్రం మొక్కవోని ధైర్యంతో అన్నిటిని సహించాడు, ఎదుర్కొన్నాడు.
    ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. ముస్లింలీగ్‌ నేతగా తనదైన భావాల వైపుగా లీగ్‌ను నడిపించేందుకు ప్రయత్నించాడు. లీగ్‌ ప్రతినిధుల బృందలో సభ్యుడిగా లండన్‌ వెళ్ళాడు. లీగ్‌ సమావేశాలలో '..the attainment of swaraj or complete independence, free from all foreign control, by the people of India by all legitimate and peaceful means..'  అంటూ ప్రతిపాదించి చర్చించాడు. భారత రిపబ్లిక్‌, అమెరికా తరహా ఐక్య సమాఖ్యగా ఉండాలని ఆయన వాంఛించాడు. సహాయనిరాకరణ కొంత వరకు మాత్రమే సత్పలితానిస్తూందని అభిప్రాయపడుతూ, సాయుధ  గెరిల్లా పోరాటాలను ఆరంభించాలన్నాడు. ముస్లింల అభ్యున్నతి కోసం సాంకేతిక విద్యాసంస్థలను, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించాలన్నాడు. ప్రత్యేక నియోజకవర్గాలు వద్దన్నాడు.  బ్రిటీషర్లను తరిమివేసేందుకు హిందూ-ముస్లిం మధ్య ఐక్యత చాలా అత్యవసరమన్నాడు. హిందూ-ముస్ల్లిలు తమ తమ ప్రత్యేక డిమాండ్లను ప్రక్కన పెట్టి ఉమ్మడి శతృవుపై పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ ప్రయత్నంలో మహ్మద్‌ ఆలీ జిన్నా భావాలను తీవ్రంగా వ్యతిరేకించాడు.
    1921లో అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగాన్ని పురస్కరిచుకొని రాజద్రోహం నేరం మొపుతూ, ప్రభుత్వం ఆయనకు మళ్ళీ రెండేళ్ళు జైలుశిక్ష విధించింది. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పక్షం ముందుకొచ్చినా మౌలానా మద్దతు నిచ్చేవాడు. ఆయన కమ్యూనిస్టు పార్టీకి సన్నిహితుడయ్యాడు. 1925లో కాన్పూరులో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశాల నిర్వహణకై ఏర్పడిన ఆహ్వాన సంఘానికి ఆయన అధ్యక్షత వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ' communism is a movement of the peasants and workers. Some may think that communism synonyms with chaos and Killings... our independence should be based on the model of the soviet Govt. Where Communism shall be ruling political creed..' అభివర్ణించాడు.
    ' సంపూర్ణ స్వరాజ్యం' సాధించేందుకు హిందూ-ముస్లిం ఐక్యత ఎంతో అవసరమని నమ్మిన ఆయన, 1927-28లో కలకత్తాలో జరిగిన ఐక్యతా సమావేశంలోని నిర్ణయాలను  హిందూ సోదరులు నిరాకరించటంతో తీవ్ర వ్యధకు గురయ్యాడు. గాంధీజీ సిద్దాంతాలకు అన్ని సమయాలలో అనుసరించదగినవి కావన్న అభిప్రాయం గల మౌలానా తన వాదనను విన్పించటంలో ఏ మాత్రం వెనుకాడేవాడు కాదు. నిర్భయంగా, నిక్కచ్చిగా తన భావాలను తెలపటంలో, ఎదుటి వ్యక్తి వాదనను, ఎదుర్కొనటంలో ఏ మాత్రం మొహమాట పడేవాడు కాదు. మౌలానా వాదనా పటిమ  గురించి టర్కీకి చెందిన రచయిత్రి Halide Eidb  1937లో మహాత్మాగాంధీ మాట్లాడుతూ ' when I have a talk with Mohani, I can not sleep in peace..' అన్నాడంటే మౌలానా వాదన ఏ స్థాయిలో ఉండేదో ఊహించవచ్చు. 1921 నుండి పోరాడుతున్నా  ' సంపూర్ణ స్వరాజ్యం ' ప్రతిపాదనను గాంధీజీ ఒత్తిడి వలన తీర్మానంగా కాంగ్రెస్‌ ఆమెదించక పోవటం, తన విప్లవాత్మక భావాల పట్ల తరచుగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత వలన విసిగిన ఆయన 1928లో కాంగ్రెస్‌ నుండి  బయటకు వచ్చేసాడు.  ఆయన బయటకు వచ్చాక, 1929 అక్టోబరు 31 నాటి లాహోర్‌ సమావేశంలో ఆయన కల పూర్తిగా నిజమైంది.  1921 నుండి ఆయన చేస్తూ వచ్చిన ' సంపూర్ణ స్వరాజ్యం ' డిమాండ్‌ కాస్తా పూర్తి స్ధాయిలో తీర్మానమైంది. వ్యక్తి సత్యాగ్రహోద్యమంలో చురుగ్గా పాల్గొని ఆయన, లక్నోలోని అమానుల్లా పార్క్‌లో బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ ప్రసంగించాడు. ఆ సందర్భంగా  పోలీసులు ఆయనను అరెస్టు చేయ ప్రయత్నించారు. అరెస్టును హస్రత్‌ తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆయనను బలవంతంగా  వాహనం మీదకు విసిరి పోలీసులు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 1937లో ఆయన సహ్మధర్మచారిణి నిశౄతున్నిసా బేగం కన్నుమూసారు. అన్ని విధాల తోడ్పాటునిచ్చి, కష్టకాలంలో అండగా నిలచిన  అర్థాంగి మృతి ఆయనను తీవ్రంగా కలచివేసింది. ' సంపూర్ణ స్వరాజ్య' సాధనకు అంకితమైన వ్యక్తిగా రాజకీయాల నుండి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు.     బ్రిటీష్‌ పాలకులతో ఏ మాత్రం రాజీపడని ఆయన బానిస బంధనాల నుండి విముక్తిని సదా కాంక్షించాడు. ఆ దిశగా ఏ వ్యక్తి  మరే శక్తి పోరాటం సాగిస్తున్నా ఆయన అండదండలు అందించాడు. 1931లో ' లీగ్‌ '  ఐలిజితీ స్త్రళిఖీశి. డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసింది.  ఆ సమయంలో  ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ 'al hamdolilla Muyslium League council in its meetings of 1914 accepted Self Government  as its Goal, Which I declared in 1907.' అన్నాడు.
    ఆ తరువాత మౌలానా హస్రత్‌ 1915లో ముస్లింలీగ్‌లో చేరాడు. చివరి వరకు ముస్లిం లీగ్‌తో సంబంధాలను కొనసాగించినా, ఆయన ఏక్కడా రాజీపడలేదు. 1916లో లీగ్‌ కోరిన ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించాడు. ఇంగ్లాండ్‌ వెళ్ళిన లీగ్‌ ప్రతినిధివర్గ సభ్యుడై ఉండి ఖిలాఫత్‌ ఉద్యమాన్ని బలపర్చుతూ, భారతీయుల పోరాటం న్యాయమైనదని వాదించాడు. జీవిత పర్యంతం స్వేచ్చా, స్వాతంత్య్రాల విషయంలో ఏ విధమైన రాజీ ధోరణిని ఆయన అంగీకరించలేదు. 1937 సంవత్సరంలో లక్నోలో జరిగిన లీగ్‌ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ '.. Establishment of India of full independence in the form of a federation of free democratic states in which rights and interests of the Muslamans and other minorities are adequately and effectively very safe of safe guarded in the constitution....'. అన్నాడు. అల్ప సంఖ్యాక వర్గాల ప్రజానీకం సమాన హక్కులు రాజ్యాంగ పరంగా పొందగలరని వాంఛించాడు.
    గాంధీజీ, జిన్నాలతో రాజకీయ సిద్దాంత పోరాటాలు జరపటంలో రాజీపడని నిర్భయుడైన యోధుడాయాన. గాంధీజిని సంపూర్ణ స్వరాజ్య తీర్మానం విషయంలో  ఏ విధంగా ఎదుర్కొన్నాడో అదే విధంగా 1942లో అలహాబాద్‌లో జరిగిన లీగ్‌ సమావేశంలో అత్యంత బలమైన నాయకుడైన మహమ్మద్‌ అలీ జిన్నాను ఎదుర్కొన్నాడు.  నమ్మిన విషయంలో  ఏ మాత్రం సదలింపు కన్పించేంది కాదు. క్రిప్స్‌ ప్రతిపాదనల విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు జిన్నాను 'డిక్టేటర్‌'గా అంగీకరించేందుకు  లీగ్‌ చేసిన నిర్ణయాన్ని, ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఆ సమయంలో లీగ్‌లో తిరుగులేని నాయకుడి వెలుగొందుతున్న జిన్నాను వ్యతిరేకించటం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యం కాగల వ్యతిరేక పరిస్థితులైనప్పటికీ, ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన ఏకైక వ్యక్తిగా ఖ్యాతి గాంచాడు.      సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి, సామ్యవాద వ్యవస్థ అనుకూలుడైన హస్రత్‌ మోహాని బ్రిటీష్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షను తీవ్రంగా విమర్శించాడు. సామ్రాజ్యవాదుల కుయుక్తులకు బలవుతున్న ముస్లిం దేశాల ప్రజల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటమే కాక, కార్యాచరణకు పూనుకున్నాడు. పాలస్తీనాలో బ్రిటీషర్లు అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ' లీగ్‌ 'లో 1938 తీర్మానం చేయించటమే కాక 1938 ఆగష్టు 26ను పాలస్తీనా దినోత్సవంగా ప్రకటింపజేసాడు.
    1946లో జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్‌ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. భారత విభజన ప్రతిపాదనను విరమించుకోవాల్సిందిగా లీగ్‌ను కోరాడు. ఈ విషయమై  కౌన్సిల్‌ సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేశాడు. ఇస్లాం బోధనల ప్రకారంగా  జీవితం గడుపుతూ తనదైన శైలితో సాగుతున్నప్పటికీ, మతం పేరుతో దేశవిభజనను ఆయన పూర్తిగా  వ్యతిరేకించాడు. భారతదేశం చీలిపోవటంతో ఆయన  తీవ్రంగా వ్యధకు గురయ్యాడు. భారత విభజన జరిగాక ఆయన తన జన్మభూమిని విడిచివెళ్ళటానికి ఇష్టపడలేదు. మిత్రులు ఒత్తిడి తెచ్చినా ఆయన వినలేదు. అనంతరం స్వతంత్య్ర భారతావనిలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన ఉత్తరప్రదేశ్‌ నుండి ఎన్నికయ్యాడు. జీవితపు ఆఖరి ఘడియ వరకు ఆయన రాజకీయ రంగాన్ని వీడలేదు. ప్రజా జీవితానికి దూరం కాలేదు.  బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రజా సంఘాల ఆవశ్యకతను గుర్తించిన మౌలానా అనేక సంస్థలను స్థాపించి, నిర్వహించాడు. వాటిలో ' అంజుమన్‌-ఎ-కాబా ', ' మజ్లిసే అహరార్‌ ', ' ఖయామతుల్‌ ఉల్‌మా-ఎ-హింద్‌ ', ' అంజుమన్‌-ఎ-ఖుద్దాములహరమైన ్‌, అజాద్‌ పార్టీ లాంటివి ప్రధామైనవి.
    భారత విభజన తరువాత రాజ్యాంగాన్ని రూపొందించే కార్యక్రమంలో భాగంగా, ఆయన రాజ్యాంగ పరిషత్తు సభ్యుడయ్యాడు. రాజ్యాంగ నిర్మాణంలో తరదైన పాత్రను నిర్వహించాడు. అయితే పూర్తయిన రాజ్యాంగముసాయిదా మీద సంతకం చేయ నిరాకరించాడు. భారత విభజనను, కామన్‌వెల్త్‌లో భారతదేశం సభ్యత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, నిరసనగా మౌలానా మోహాని సంతకం చేయలేదు.
    ఒకవైపు స్వాతంత్య్ర సమరాంగణాన వీరోచిత పోరాటాలు సాగిస్తూనే, మరోవైపున బ్రిటీష్‌ ప్రభుత్వపు కిరాతకత్వాన్ని అనునిత్యం రుచి చూస్తూ కూడా తనలోని కవిని విస్మరించలేదు.  ఉర్దూ, అరబిక్‌, పర్షియన్‌ భాషలో పాండిత్యం సంపాదించాడు.  మృధు మధురమైన కవిత్వాన్ని సాహిత్య జగత్తుకు సమర్పించుకున్నాడు.  పలు మార్లు కారాగారవాసం అనుభవించినా ఆ కాఠిన్యం మాత్రం ఆయనను సమీపించలేదు. ఉర్దూ కవితా ప్రియులు ఎంతో ప్రీతితో గానం చేసే ' చుప్‌కే చుప్‌కే రాత్‌ దిన్‌ ఆంసూ బహానా యాద్‌హై ' గజల్‌ హస్రత్‌ మోహాని కలం నుండి జాలువారింది. ఉర్దూ గజల్‌కు క్రొంగొత్త ద్వారాలను తెరచిన ఆయన అనేక వందల అద్భుతమైన గజల్స్‌ అందించాడు.
    ఆయన ఏ రాజకీయ పక్షంలోనున్నా, మరే సంస్థలో నున్నా, ఆయా సంస్థల, రాజకీయ పక్షాల ఉద్దేశాల లక్ష్యాలకు అతీతంగా,  ప్రజా సంక్షేమం మాత్రమే ఆయనకు ప్రధానమైన కర్తవ్యమయ్యేది.  మౌలానా హస్రత్‌ మోహాని గురించి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ... ' అందరూ స్వార్థం కోసం, పార్టీ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. అయితే మోహాని ప్రజల కోసం ఆంతరాత్మ ప్రబోధం మేరకు ఏమైనా చేయటానికి సిద్దపడతారు...' అన్నారంటే ప్రజాప్రతినిధిగా ప్రజల క్షేమమే పరమావధిగా మంచి పార్లమెంటేరియన్‌గా ఆయన ఎలా రాణించాడో అవగతం చేసుకోవచ్చు.
    సంపూర్ణ స్వరాజ్యం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, శాసనోల్లంఘన లాంటి కార్యక్రమాల ద్వారా ప్రచారాన్ని మహోధృతంగా నిర్వహించిన నాయకునిగానే కాకుండా, చిత్తశుద్దితో ఆయన కార్యక్రమాలను అమలుపరచి అందరికి ఆదర్శప్రాయుడు అయ్యాడాయన. కవి, రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, వక్త, బహుభాషా కోవిదుడు, కార్యకర్త, కార్యదకక్షుడు, ప్రజా నాయకుడు, విప్లవకారుడు అన్నింటికి మించి మానవతావాది, అకంళంక దేశభక్తుడు, అవిశ్రాంత ప్రజాసేవకుడైన మౌలానా హస్రత్‌ మోహాని లక్నోలో 1951లో మే 13వ తేదీన కన్నుమూసారు.

Friday, 27 April 2012

మైసూరు పులి టిపూ సుల్తాన్‌


                                                            మైసూరు పులి టిపూ సుల్తాన్‌
            భారతదేశ రాజకీయ చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్ధ భాగం ఎంతో కీలకమైన సమయం. బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను పరాజితుడ్ని చేసి, బెంగాల్‌ దివానిని హస్తగతం చేసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, దక్షణాదిని ఆక్రమించు కోవటానికి యుక్తులు, కుయుక్తులు పన్నుతున్నారు. ఈ సామ్రాజ్యవాద శక్తుల రాజ్యవిస్తరణ కాంక్షను అర్ధం చేసుకొలేని స్వదేశీపాలకులు పరస్పరం కలహించు కుంటున్నారు.  ఆ సమయంలో '' నేనున్నా నేనున్నా నంటూ.. '' భారత రాజకీయ చిత్రపటం మీద ఉదయించాడు   మైసూరు పులిగా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌.
              ఈ గడ్డ మీద నిలదొక్కుకుంటున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులను తొడగొట్టి సవాల్‌ చేసిన టిపూ సుల్తాన్‌ 1750 నవంబర్‌ 10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా దేవనహళ్ళి గ్రామంలో జన్మించాడు. అసమాన ధైర్యసాహసాలతో '' దక్షిణ బారత దేశపు నెపోలిన్‌ ''గా ఖ్యాతిగాంచిన, అరివీర భయంకరుడు హైదర్‌ అలీ, శ్రీమతి ఫాతిమా ఫక్రున్నిసాలు టిపూ తల్లి తండ్రులు.
            విద్యాగంధం లేని హైదర్‌, తన బిడ్డ మంచి విద్యాబుద్దులు చెప్పించాడు. తండ్రి ప్రత్యేక పర్యవేక్షణలో యుద్ధ కళను టిపూ ఔపోసన పట్టాడు.  ఆనాటి ప్రముఖ యోధులలో అగ్రగామిగా  గుర్తింపు పొందిన టిపూ  చిన్నతనం నుండి తండ్రి నాయకత్వంలో సాగిన అన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు. ఏ ఆంశానికి సంబంధించినదైనా, ఎటువంటి విశిష్ట, సాంకేతిక సమాచారమైనా అధ్యయనం చేసిన ఆకళింపు చేసుకోవటం నూతనత్వాన్ని అనునిత్యం ఆమ్వానించే  టిపూ, భారతీయ, పాశ్చాత్యా తత్వవేత్తల, రాజనీతిజ్ఞుల గ్రంధాలను సేకరించి అధ్యయనం చేసాడు.
            పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చేసరికి రాజ్యపాలన వ్యవహారాలలో, తండ్రితోపాటుగా యుద్ధాలలో పాల్గొన గలిగిన స్థాయినీ, సామర్ధ్యాన్నీ సంపాదించుకున్న టిపూ 1763లో జరిగిన మలబార్‌ పోరాటంలో పాల్గొన్నాడు. 1769-72 వరకు మారాఠాలతో సాగిన యుద్ధాలలో పాల్గొని, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు.  ప్రధమ మైసూరు యద్ధంలో బ్రిటీషర్ల కూటమి నుండి నిజాం నవాబును దూరం చేసేందుకు సాగిన ప్రయత్నాలలో  భాగంగా చిన్న వయస్సులోనే  చాకచక్యంగా దౌత్యం నడిపి, విజయం సాధించి  రాజనీత్ఞడన్పించుకున్నాడు. తండ్రి బాటలో యుద్ధ కళలలో ప్రావీణ్యత సంపాదించిన, టిపూ పురాతన సాంప్రదాయ యుద్దరీతులను అనుసరిస్తూనే, సాశ్చాత్య యుద్ధ వ్యూహాలను అనుగుణంగా సైన్యాన్ని అధునీకరించి మంచి తర్ఫీదు నిప్పించాడు. సరికొత్త ఆయుధాలను యుద్ధవ్యూహాలను రూపొందించిన విజయాలను రాచబాట వేసాడు. 1780లో కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ని తరిమి కొట్టిన చారిత్రక సంఘటనలో ప్రముఖ పాత్ర వహించాడు.
             దక్షణాదిలో మైసూరును బలిష్టమైన రాజ్యంగా రూపొందించాలని కలలుగన్న హైదర్‌ అలీ శత్రువు దాడుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు అత్యధిక కాలం రణాభూమిలోనే గడిపి 1782 నవంబరు 6, రణరంగంలో చివరి వ్వాస వదిలాడు. ఈ విషాద వార్త టిపూకి అందేనాటికి ఆయన మలబార్‌ తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి తరిమి కొడుతున్నాడు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిపూ సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, తన 31వ ఏట 1781డిసెంబర్‌ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని చేబట్టాడు. చిన్న వయస్సులోనే శౌర్యపత్రాపాలతో వీరుడిగా ప్రజలను ఆకట్టుకున్న టిపూ, '' మైసూర్‌ సుల్తాన్‌ '' అయ్యాడు. టిపూ ప్రజల సంక్షేమంలో రాజ్యక్షేమం, రాజు సంక్షేమం దాగుందన్న సత్యాన్ని, అర్ధం చేసుకున్న టిపూ రాజ్యభిషేకం రోజుననే, ' మిమ్ముల్ని వ్యతిరేకించినట్టయితే నేను నాస్వర్గాన్ని, నాజీవితాన్ని, నాసంతోషాన్ని కోల్పోవచ్చు. నా ప్రజల సంతోషంలోనే నా సంతోషం. నా ప్రజల సంక్షేమంలోనే నా సంక్షేమం ఇమిడి ఉంది. నాకిష్టమైందల్లా మంచిదని నేను భావించను. నా ప్రజలకు ఏది ఇష్టమో దానిని నా అభిష్టంగా భావిస్తానని ' టిపూ ప్రకటించాడు.
            ఒకవైపు టిపూను దెబ్బతీయడానికి అదను కోసం ఎదురు చూస్తున్న  స్వదేశీ శత్రువులు, మరొకవైపు పరాజయాల పరంపరతో రగిలిపోతున్న విదేశీ శత్రువతో మైసూరు రాజ్యం చుట్టుముట్టబడి ఉండటంతో, శ్వాస పీల్చుకోవటానికి కూడా తీరిక లేనప్పటికీ, టిపూ ప్రజారంజకమైన పాలనను అందిస్తూ, ప్రజల ఆర్ధిక వ్యవమారాలలో ఆయన చూపిన శ్రద్ధను గమనించిన ఆంగ్లేయాధికారి గ్రాంట్‌, టిపూ చర్యలను ప్రశంసిస్తూ టిపూ తన రాజ్యం యొక్క ఆర్ధిక వ్యవహారాలను నిర్వహించిన తీరు ఉదాహరణగా నిలచిపోతుందని అనటం విశేషం. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాలకు వర్తింపచేసాడు. ప్రభుత్వ విభాగాలలో ప్రజలకు సంబంధించిన అన్ని రంగాలలో పలు విప్లవాత్మక మార్పులు చేసాడు. స్వదేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా పరిశ్రమలను స్థాపించి అభివృద్దిపర్చాడు. పలు ప్రాంతాలనుండి చేతి వృత్తి కళాకారులను, నిపుణలను రప్పించి ప్రజలకు శిక్షణ ఇప్పించాడు. అబివృద్ది పధకాలను ఆవిష్కరింపచేసి సమర్ధవంతంగా అమలుజరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నూతన తరహా సహకార బ్యాంకులను ఏర్పాటు చేసాడు. సంపన్న వర్గాల పెత్తనం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాడు. పేద వర్గాలను పొదుపు వైపుకు ఆకర్షించేందుకు తక్కువ మొత్తాలను లాభాలను ప్రకటించాడు. పొదుపును, మదుపును ప్రోత్సహించాడు. తూనికలు - కొలతల వ్యవస్థను ఆధునీకరించాడు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి ఎగుమతులను చేపట్టాడు. నానికా వ్యాపారాన్ని వృద్ధిచేసాడు.   విదేశాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని ఎగుమతులు - దిగుమతుల వాణిజ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాడు. విదేశీ వర్తకాన్ని  ప్రోత్సహించాడు. వర్తక, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వ పాత్రను అధికం చేస్తూ , ప్రభుత్వ వ్యాపార సంస్ధను (State Trading Corporation.) ఏర్పాటు చేసాడు. వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు అధిక శ్రద్ధ వహించాడు. నాడు కావేరి నది మీద ఎక్కడయితే ప్రాజెక్టు కట్టాలని ఆయన ఉద్దేశించాడోఈనాడు  కృష్ణరాయనగర్‌ ఆక్కడే నిర్మాణమైంది.   పంట సిరులు అందించే రైతుకు భూమి విూద హక్కును కల్పించాడు.  బంజరు భూములను మాగాణులుగా మార్చే రైతు, మూడు సంవత్సరాల పాటు  పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు. పన్నుల వసూలుకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించాడు. వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం రైతులకు రుణ సౌకర్యం కల్పించాడు. టిపూ జనరంజక పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ తన History of British India లో,  'భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలందరి కంటే టిపూ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు. పంటలు బాగా పండాయి'అని పేర్కోన్నాడు.
            ప్రాక్‌-పశ్చిమ దేశాల సామాజిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్న టిపూ సాంద్రాయక ప్రభుత్వ పాలనకు భిన్నంగా, ప్రజలకు ఉత్తమ సేవలను అందచేసే ఆధునిక పద్ధతులను ప్రవేశ పెట్టినతొలి స్వదేశీ పాకుడిగా ఖ్యాతి గడించాడు. ప్రభుత్వ యంత్రాగాన్ని పలు మార్పులకు గురిచేసాడు. టిపూపాలన ఆశ్చర్యంగా అత్యంత ఆధునిక సూత్రాలకు అనుగుణంగా సాగిందంటూ ప్రముఖ ఆంగ్లేయ రచయిత ఫెర్నాండజ్‌ తన 'Storm Over Srirangapatnam' లో ప్రశంసించాడు. ప్రజలకు నష్టం కలిగించే శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. ప్రజలకు ఎవరు శత్రువులో వారు తనకూ శత్రువులన్నాడు.  నా ప్రజలతో ఎవరు కలహిస్తారో, వారో నాతో యుద్దం ప్రకటించినట్టు, అని టిపూ విస్పష్టంగా ప్రకటించాడు.
            పూర్వీకుల సాంప్రదాయలను గౌరవిస్తూనే పలు ప్రజోపయోగకర సంస్కరణలకు టిపూ అంకురార్పణ చేశాడు. సంస్కరణల అమలు విషయంలో వ్యక్తిగత కష్ట నష్టాలను కూడా ఖాతరు చేయలేదు.  వ్యభిచారం, బానిసత్వం, బహు భర్తృత్వం, మధ్యపానాన్ని నిషేధించాడు. మలబారు మహిళలు నడుం పైభాగాన ఎటువంటి ఆఛ్చాదన లేకుండా అర్దనగ్నంగా తిరగటం గమనించి, మహిళలంతా రవికలు ధరించాలని ఆజ్ఞలు జారీ చేశాడు. మహిళలకు అవసరమగు బట్టను కూడా ఉచితంగా అందజేశాడు. ఈ అజ్ఞలను ధిక్కరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. నరబలులను నిషేధించాడు. ఫకీర్లు - సన్యాసులు మాదక ద్రవ్యాలను తీసుకోవటం తీవ్రమైన నేరంగా పరిగణించాడు. ఆనాధలైన బాలికల క్రయవిక్రయాలు శిక్షారమైన తీవ్ర నేరాలుగా ప్రకటించి, పొగాకు సేవనం అనారోగ్యకరమని నిషేదించాడు. దుబారాను తగ్గించాలని, వ్యక్తి తన సంపాదనలో ఒకశాతం కంటే ఎక్కువ విలాసాలకు ఖర్చుచేయరాదని అధికారులకు ఆజ్ఞలు జారీచేసాడు. అంగ వికలాంగులకు, అంధులకు ఆత్మస్థైర్యం కలుగ చేసేందుకు పలురకాల సహయక చర్యలు అమలుచేశాడు. చిన్న, చిన్న నేరాలకు పాల్పడిన రైతులకు విధంచే  సమాజానికి ఉపయోగపడాలని భావించిన టిపూ శిక్షా విధానాన్ని సంస్కరించాడు. గతంలోలా జరిమానా విధించడాన్ని తొలగించి, జరిమానా సొమ్ముకు బదులుగా, గ్రామ పొలిమేరల్లో మొక్కలను నాటాలని, ఆ మొక్కలకు సక్రమంగా నీళ్ళు పోస్తూ, బాగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలను నిర్వహించాలని 1792లో శాసనం చేశాడు.
            టిపూ 17 సంవత్సరాల పాటు సాగించిన పరిపాలనలో అత్యధిక సమయం తన రాజ్యాన్ని కబళించాలననుకుంటున్న బ్రిటీషర్లను, నిజాం నవాబు, మరాఠాలను ఎదుర్కొంటూ గడిపినప్పటికీ, స్వదేశీ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూనే, అంతర్జాతీయ వ్యవహారాలను కూడా దక్షతతో నిర్వహించి చరిత్రకారుల ప్రసంశలను అందుకున్నాడు.  ఈస్ట్‌ ఇండియా కంపేనీ పాలకులను తరిమి కొట్టేందుకు పొరుగున ఉన్న నిజాం నవాబు, మరాఠా నాయకులు ఏకమై ఐక్యసంఘటనగా ఏర్పడేందుకు కలసి రావాల్సిందిగా కోరాడు. బలమైన శక్తిగా ఎదుగుతున్న మైసూరు రాజ్య ప్రాభవ వైభవాన్ని సహించలేని స్వదేశీపాలకులు, ఆయనకు తోడ్పాటు, ఇవ్వకపోవటంతో విదేశీయుల వైపు దృషి సారించాడు. 'శత్రువు శత్రువు, మిత్రుడు', అనే రాజకీయ సూత్రీకరణను అనుసరిస్తూ, తొలుత ఫ్రెంచ్‌వారిని, ఆ తరువాత టర్కీ, అఫ్ఘనిస్తాన్‌ ఇరాన్‌, దేశాధినేతల స్నేహహస్తం కోరాడు. టిపూ వ్యవహార దక్షత వలన ఈ దేశాధి నేతలనుండి అనుకూల స్పందన లభించింది. ఆ నాడు అంతర్జాతీయ రంగాన బ్రిటీషర్ల ప్రభ వెలిగిపోతున్నందున, కీలకమైన  థలో టిపూకు సహాయం లభించలేదు.
            బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇతర దేశాల స్నేహహస్తం కాంక్షించినట్టుగానే, దేశీయ వర్తక, వాణిజ్యాలు, ఎగుమతులు, దిగుమతులు, స్వదేశీ పరిశ్రమలు, ఆధునిక ఆయుధాల తయారికి అవసరమగు సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు విదేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్ట పర్చేందుకు, టిపూ బుద్ది కుశలతతో వ్యవహరించి విజయం సాధించాడు. కచ్‌, మస్కట్‌, పెరూ, ఒర్మాజ్‌, జిద్దా, బసరా, ఎడెన్‌, దేశాలలో వర్తక - వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయటమేకాక, చైనా, ప్రాన్స్‌, టర్కీ, ఇరాన్‌ లాంటి దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పాడు. అమెరికా వర్తకులను ఆహ్వానించాడు. స్వదేశీవస్తువుల ఎగుమతులను ప్రోత్సహించాడు. విదేశీ వర్తకం ఏమేరకు చేసినా బ్రిటీషర్ల వస్తువుల వాడకాన్ని ఆయన అంగీకరించ లేదు. వలస పాలకుల వస్తులన్నిటినీ టిపూ నిషేదించాడు. మైసూరు రాజ్యంలోకి ఇంగ్లాడ్‌ వస్తువులను రానివ్వలేదు. ఇగ్లాండు వర్తకుల నుండి ఎటువంటి వస్తువులను కొనరాదంటూ, ప్రభుత్వ వ్యాపార ప్రతినిధులకు ప్రత్యేక ఆదేశాలను జారీచేశాడు. ఈ మేరకు ఆనాడే టిపూ విదేశీవస్తువుల బహిష్కరణకు శ్రీకారం చుట్టాడు.వర్తక వాణిజ్యాభివృద్ధితో పాటు విదేశాలలో కర్మాగారాలను స్థాపించేందుకు విదేశీనేతలను అంగీకరింప చేయటంలో టిపూ విజయం సాధించాడు. స్వదేశంలో పరిశ్రమల స్ధాపనకు  ప్రోత్సాహకాలు ప్రకటించాడు. స్వదేశీ పరిజ్ఞానానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం జోడించి రాకెట్ల నిర్మాణానికి ప్రయత్నాలు చేశాడు.
             టిపూ విద్యాధికుడు కావటమే కాకుండా, సాహిత్యాభిలాషిగా కూడా పేర్గాంచాడు. కన్నడ, తెలుగు, మరాఠి, అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ, ఫ్రెంచ్‌, భాషలను నేర్చుకున్నాడు. పండితులను గౌరవించటం, సాహిత్య సభలను నిర్వహించటం, గ్రంధాలను రాయించటం పట్ల టిపూ ఎంతో ఆసక్తి చూపాడు. ఆయన స్వయంగా 45 గ్రంధాలు రాశాడు. ఆయన స్వతం గ్రంధాలయం విలువైన 2వేల పుస్తకాలతో నిండి ఉండేది. టిపూ గ్రంధాలలో మొగల్‌చక్రవర్తి జౌరంగజేబు స్వదస్పూర్తితో రాసిన ఖురాన్‌ కూడా ఉంది. నిరంతరం రాజకీయాలు, పోరాటాలు, యుద్ధాలలో మునిగి తేలుతూ కూడా ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకాన్ని కొంతసేపన్నా చదవనిదే టిపూ విశ్రమించేవాడు కాడట.
టిపూ స్వయంగా  ' Fauji Akhbar' అను ఉర్దు వారపత్రికను 1793లో ప్రారంభించినుండి  జీవిత చరమాంకం వరకు నడిపాడు. ఈ పుత్రిక టిపూ సైన్యానికి సంబంధించిన సమాచారం మాత్రమే అందించేది కావటంతో సామాన్య ప్రజల వరకు అది చేరలేదు.  టిపూ స్వయంగా 'జాకోబియన్‌ క్లబ్‌' అను సంస్ధను ప్రారంభించిఆ సంస్ధ ప్రారంభోత్సవం సందర్భంగా  మొక్క నాటుతూఆ మొక్కకు ' స్వేచ్ఛావృక్షం (Tree of Liberty) అని నామకరణం చేయటమే కాకుండా తనను తాను మైసూరు  మైసూరు పౌరుడుగా (Tipu citizen of mysore) పిలుచుకున్నాడు. ఒక రాజరిక వ్యవస్ధకు చెందిన పాలకుడు ఈ విధంగా ప్రజాస్వామిక భావన ప్రకటించడం విశేషం.
            ప్రజలను విద్యావంతులు చేయటానికి టిపూ ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. విద్యను నిర్బంధం చేసి, ఉచిత విద్యను ప్రవేశ పెట్టాడు. పలు విద్యాలయాలను ఏర్పాటు చేయించాడు. రాజధాని శ్రీరంగపట్నంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని టిపూ సంకల్పించాడు. ఈ విశ్వవిద్యాలయానికి JAMIAL UMUR అని నామకరణం చేయాలని ఉవ్విళ్ళూరాడు. ఈ విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞానంతో పాటుగా, పాశ్చాత్య విజ్ఞానాన్ని బోధించాలని, మానవీయ, సాంకేతిక విద్యాభ్యాసానికి అగ్రస్ధానం కల్పించాలని ఆశించాడు. ఆ మైసూరు సూర్యుడు ఆకస్మికంగా అస్తమించటంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు కలగానే మిగిలి పోయింది.
            టిపూ సుల్తాన్‌ ఇస్లాం ధర్మానురక్తుడు. టిపూ ఖురాన్‌ గ్రంధంను చాలా కక్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. నిత్య జీవితంలోని సమస్యలకు ఖురాన్‌ గ్రంధం నుండి ప్రవచనాలను అతి సునాయసంగా ఉల్లేఖిస్తూ, పరిష్కార మార్గాలు సూచించటంలో టిపూ ఆసక్తి చూపాడు.    స్వమతం పట్ల అభిమానం గల ప్రభువు తప్ప, ఆయన మత దురభిమానికాదు.  టిపూ మతాతీతంగా వ్యవహరించాడు. ప్రజల మత విశ్వాసాలలో కలుగజేసుకోవద్దని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీచేశాడు.  బహుళమతాలు, జాతుల ప్రజలు సహజీవనం సాగిస్తున్న రాజ్యంలో అన్ని మతాల ప్రజలపట్ల సమభావన చూపడం టిపూ ప్రత్యేకత.  ప్రతి ఒక్కరి మత సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. నైతిక విలువలకు భంగకరం కానంతవరకు ఏ మత సాంప్రదాయాలను ఆయన పట్టించుకోలేదు.  ప్రజలకు సరైన న్యాయం ప్రసాదించేందుకు, న్యాయ స్థానాలలో అన్ని మతాలకు చెందిన న్యాయాధికారులను నియమించాడు. ఫిర్యాదులను, సమస్యలను వ్యక్తిగత చట్టాలను అనుసరించి విచారించమన్నాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో పోరాడుతున్నా క్రైస్తవ మతాచారులపట్ల ఎంతో గౌరవం, ఆదరణ చూపాడు. మసీదు-మందిరాల మధ్యన టిపూ తేడా చూపించ లేదు. 1791-92లో మైసూరు రాజ్యం మీద దాడి జరిపిన మరాఠాలు శృంగేరి పీఠానికి చెందిన విలువైన వస్తువులను, ఆస్తిపాస్తులను దోచుకున్నారు. ఆలయంలోని శారదామాత విత్రహాన్ని కూడా పెకిలించి బయటకు విసిరివేశారు.  ఈ సంఘటనను శృంగేరి పీఠాధిపతి టిపూకు తెలుపగాజరిగిన సంఘటనకు బాధపడుతూ, పీఠాధిపతి  ఒక లేఖ రాస్తూ, ' పవిత్ర స్థలం పట్ల పాపం చేసిన వ్యక్తులు అందుకు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని ' ఆగ్రహం వ్యక్తం చేశాడు. టిపూ అంతటిలో సరిపెట్టుకోకుండా, ఆలయ పునరుద్ధరణకు  సహాయం చేశాడు. ఈ ఆలయమేకాదు, మైసూరు రాజ్యంలో గల పలు ఆలయాలకు గ్రాంటులను, ప్రత్యేక నిధులను సమర్పించాడు. ఈ మేరకు ఆయన 156 ఫర్మానాలు జారీచేశాడు. ప్రముఖ శృంగేరిమఠం స్వామీజీతో పలు ధార్మిక, సామాజిక విషయాలను ప్రస్తావిస్తూ, కన్నడంలో టిపూ 30 లేఖలు వ్రాశాడు. ప్రసిద్ధిచెందిన లక్ష్మినాధస్వామిలయం (కలాల), నారాయణస్వామి ఆలయం (మేల్కోట్‌), శ్రీ కంఠేశ్వర ఆలయం, నజుండేశ్వరి ఆలయం (నంజూగూడ్‌) తదితర ఆలయాలకు అవసరమగు వెండి, బంగారు పాత్రలు, ఆభరణాలు, ఖరీదైన దుస్తులను టిపూ అందచేశాడు. తన తండ్రి హైదర్‌ అలీచేత శంఖుస్థాపన చేయబడిన కంజీకరం గోపురాలయం నిర్మాణాన్ని ఎంతో శ్రద్ధతో టిపూ  పూర్తి చేశాడు. టిపూ దిండిగల్‌ కోటమీద దాడి చేసినప్పుడు కోటలోని ఆలయానికి నష్టవాటిల్లకుండా ఫిరంగిదళం దాడులు జరపాలని, తన సైనికులకు, సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. టిపూ నివాసగృహానికి సమీపాన ఒకవైపు మసీదు, మరొకవైపున శ్రీరంగనాధస్వామీ ఆలయం ఉన్నాయి. నమాజుకు రమ్మని మసీదునుండి వినపడే పిలుపుకు ఆయన ఎంతటి ప్రాధాన్యం యిచ్చేవాడో శ్రీరంగనాధస్వామీ  ఆలయం నుండి వినవచ్చే జేగంటలకు అంతే ప్రాముఖ్యం ఇచ్చాడు. సమాజంలోని కొందరు వ్యక్తులు సాగించే కిరాతక చర్యలను ఆ వ్యక్తికి చెందిన సాంఘిక జనసముదాయానికి  అంటగట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించాడు. ఎవరు తప్పుచేసిన వ్యక్తిని మాత్రమే నిందించాలి తప్ప, ఆ వ్యక్తికి సంబంధించిన యావత్తు సమాజాన్ని తప్పు పట్టడం అహేతుకం అన్నాడు. టిపూ సైన్యంలోని 19మంది సేనాధిపతులలో 10 మంది, 13మంది మంత్రులలో ఏడుగురు హిందువులని శ్రీ బి.యన్‌. పాండే తన గ్రంధంలో వెల్లడించారు.
            టిపూ సుల్తాన్‌ మత సామరస్యాన్ని ఎంతగా పాటించినా, ఈ గడ్డను ఆక్రమించుకున్న బ్రిటీషర్లు, ముస్లిం వ్యతిరేకతను నింపుకున్న స్వదేశీ చరిత్రకారులు, టిపూను  మతోన్మాదిగా చిత్రించారు. టిపూ బలవంత మత మార్పిడికి పాల్పడి, తీవ్ర వత్తిడిని తీసుకొచ్చినందున మతాంతీకరణ యిష్టంలేని 3 వేలమంది బ్రాహ్మణులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని  అరోపిస్తూకలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతి డా||హరిప్రసాద్‌  శాస్త్రి తాను రాసిన మెట్రిక్యులేషన్‌ స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం బెంగాల్‌, అస్సాం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని ఉన్నత పాఠశాల విద్యార్ధుల చరిత్ర పాఠ్య గ్రంధంగా చలామణీ అయ్యింది. ఈ విషయం చాలకాలం తర్వాత ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు డా|| బి.యన్‌. పాండే దృష్టికి 1928-29లో రాగా ఆయన విశ్త్రుత పరిశోధన జరిపారు. అరోనణలు చేసిన           డా||హరిప్రసాద్‌ తన అభియోగాలకు అధారాలు చూసకుండా, కనీసం డాక్టర్‌ పాండే ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ముఖం చాటేయడంతో, ఈ విషయాన్ని ఆయన కలకత్తా విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ దృష్టికి తీసుకురాగా, విశ్వవిద్యాలయం సూచించిన పాఠ్య గ్రంధాల జాబితా నుండి శ్రీ శాస్త్రి గ్రంధాన్ని తొలగించారు.
            చిన్ననాటనే అసమాన ధైర్యసాహసాలతో తండ్రికి తగిన తనయుడన్పించుకున్న టిపూ, పలు విజయాలను సాధించాడు. మలబారు ఆక్రమణతో ప్రారంభమైన ఆ యుద్ధవీరుని జీవితం అటు ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఇటు స్వదేశీపాలకులైన నిజాం, మరాఠాలతో పోరుచేస్తూ ముందుకుసాగింది. చివరి శ్వాస వరకు ఈస్ట్‌ ఇండియా పాలకులను మాతృదేశం నుండి తరిమి వేయటానికి అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక స్వదేశీ పాలకుడిగా టిపూ సుల్తాన్‌ చిరస్మరణీయమైన ఖ్యాతిగాంచాడు. తండ్రి నుండి రాజ్యాధికారం పొందిన తరువాత టిపూ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది నుంచి, దక్షిణాన దిండిగల్‌ వరకు అంటే సుమారు 400మైళ్ళు పొడవున, పశ్చిమాన మలబారు నుంచి, తూర్పున తూర్పు కనుమల వరకు సుమారు 300మైళ్ళు విస్తరించగలిగాడు. అసూయా ద్వేషాలతో రగిలి పోతున్న నిజాం నవాబు, మరాఠాలు ఏకం కావటమే కాక ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో చేతులు కలిపారు. చివరకు శ్రీరంగపట్నం ముట్టడి ప్రారంభమైంది. కర్నాటక వైపు నుండి జనరల్‌ హరిస్‌, కూర్గ్‌ నుండి జనరల్‌ స్టూవర్ట్‌, హైదరాబాదు నుండి లార్డ్‌ వెల్లస్లీ, దక్షిణం వైపునుండి కల్నల్‌ రోడ్‌, కల్నల్‌  బ్రౌన్‌ చుట్టు ముట్టారు. నిజాం, మరాఠా పాలకులు, పాలెగాళ్ళు, వెల్లస్లీ కలలను నిజం చేయడానికి కంపెనీ సైన్యాలకు తోడుగా నిలిచారు.
            1799 మే మాసం 4వ తేదిన, భయంకరమైన యుద్ధం జరిగింది. టిపూ ఎంతటి నిర్ధుష్ట చర్యలు తీసుకున్నా, అంతర్గత శత్రువులను కనిపెట్టలేక పోయాడు. టిపూ దివాన్‌ మీర్‌ సాధిక్‌, రాజ్యకాంక్షతో బ్రిటీషర్లతో చేతులు కలిపాడు. టిపూ రాజ్యంలోని మరికొందరు పాలెగాళ్ళు బ్రిటీషర్లకు మిత్రులయ్యారు.  విూర్‌ సాధిక్‌ స్వామి ద్రోహం వలన, శత్రు సైన్యం కోటలోకి సునాయాశంగా ప్రవేశించింది. శతృవు కోటలోకి ప్రవేశించటంతో టిపూ సైన్యాలను కలకలం ప్రారంభమైంది.  బ్రిటీష్‌ సైన్యం అన్నివైపుల నుండి చుట్టుముట్టింది. స్వదేశీ పాలకులల కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, ఎత్తుగడలతో సాగుతున్న వలసపాలకులు సాగిస్తూన్న యుద్ధాన్ని,    స్వామిద్రోహులు చేసిన విద్రోహల వలన  శత్రుదుర్బేధ్యమైన కోటలోకి శతృసైన్యాలు భారీ సంఖ్యలో జొరబడిన విషయాన్ని ఆయన గ్రహించేలోగా   పరిస్థితులు చేతులు దాటిపోయాయి.  ఆ సమయంలో కోట నుండి తప్పించుకోమని మంత్రులు నచ్చచెప్పినా వినకుండా, విజయమో లేక వీరస్వర్గమో తేల్చుకోవాలని టిపూ నిర్ణయించుకున్నాడు. ' నక్కలాగా వంద సంవత్సరాలు బ్రతికే కంటే సింహంలా ఒక్క రోజు బ్రతికినా చాలు ' అంటూ టిపూ శత్రు సైన్యాల విూద విరుచుకుపడ్డాడు. శతృసైన్యాలు, ఆంగ్లేయాధికారుల టిపూను సమీపించడానికి భయపడేంతగా రణభూమి అంతటా తానై కన్పిస్తూ, శతృసైన్యాలలో భయోత్పాతం కల్గించాడు. శత్రు సంహారం చేస్తూ సాగుతున్న టిపూకు  అనూహ్యమైన రీతిలో తుపాకి గుండొకటి దూసుకు వచ్చి తాకటంతో ఆయన నేలమీదకు వొరిగిపోయాడు. బాధను పళ్ళ బిగువున భరిస్తూలేచి నిల్చోడానికి శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే టిపూ సైన్యం భారీ సంఖ్యలో హతమైంది. సూల్తాన్‌ను  రక్షించుకునేందుకు కనీస సహాయం కూడా అందని పరిస్ధితి.  ఆ సమయంలో కూడా, ఒక వైపు శరీరంలో రక్తమంతా భూమిని తడిపేస్తున్నా నీరసం ఆవహిస్తున్నా క్రమంగా ప్రాణం పోతున్నా టిపూ తన చేతిలోని ఖడ్గాన్ని వదల లేదు. ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టంది. బ్రిటీష్‌ సైనికులకు అడ్డులేకపోయింది. అందినంత పుచ్చుకునే అవకాశం లభించింది. టిపూ నేలకొరిగిన ప్రాంతంలో తన చేతిలోని ఖడ్గాన్ని వదల లేదు. ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గు ముఖం పట్టింది. బ్రిటీష్‌ పైనికులకు అడ్డు లేకపోయింది. అందినంత పుచ్చుకునే అవకాశం లభించింది. టిపూ నేలకొరిగిన ప్రాంతంలో ఆయన ఖడ్గం, ఆయన ధరించిన బెల్ట్‌ మీద పొదిగిన బంగారాన్ని, వజ్రాలను గమనించిన ఓ సైనికుడు  వాటిని ఊడబెరుక్కోడానికి  టిపూను సమీపించాడు.  శతృసైనికుడు సమీపిస్తున్నాడని గమనించి టిపూ చరివరి థలో కూడా శరీరంలో ఉన్న బలాన్నంతా కూడదీసుకొని ఆ సైనికుడ్ని తన కరవాలానికి ఎరచేసాడు. అస్తమించాడని  భావించిన వ్యక్తి అకస్మాత్తుగా కత్తి దూయటంతో కంగారు పడిన కంపెనీ సైనికుడు టిపూ మీద తుపాకి గుళ్ళను కురిపించాడు. టిపూ సుల్తాన్‌ గాయపడి కూడా విక్రమించటం చూసిన సైనికులు టిపూ మీద విచక్షణా రహితంగా గుండ్ల వర్షం కురిపించారు. ఆ గుండ్ల వర్షంతో అసమాన యోధుడు టిపూ సుల్తాన్‌, 1799 మే మాసం 4న తేది సాయంకాల సమయాన కన్ను మూసాడు.
             టిపూ సుల్తాన్‌ ప్రాణాలు వదలిన ఆరు గంటల వరకు ఆయన  మరణించిన వార్త  శత్రువుకు తెలియరాలేదు.  చివరకు బ్రిటీష్‌  సైనిధికారి జనరల్‌ హరిస్‌, తన సాయుధ బలగాలను, టిపూ బంధువులు, సేవకులకు వెంటబెట్టుకొని మృత వీరుల గుట్టలలో టిపూ కోసం వెతులాట ప్రారంభించాడు. చివరకు విశ్వాసపాత్రులైన సైనికుల మృతదేహల మధ్యన విగత జీవుడైన టిపూ కన్పించాడు. టిపూ భౌతికకాయాన్ని చూసి కూడా మరణాన్ని బ్రిటీష్‌ అధికారులు నిర్ధారించుకోలేక పోయారు. ఆ వీరుడు మరణించటమా అంటూ స్వజనులు నమ్మలేకపోయారు.  టిపూ బ్రతికి ఉండి, ఒక్కదుటున లేచి  లంఘిస్తే అమ్మో అనుకుంటూ భయపడిన  కంపెనీ బలగాలు టిపూ మృతదేహాన్ని సమీపించేందుకు సాహాసించ లేకపోయాయి. టిపూ మృదేహాం  చుట్టూతా సాయుధులైన సైనికులను నిల్చోపెట్టి, ఏక్షణాన్నై తుపాకులు గర్జించేందుకు వీలుగా టిపూకు గురిపెట్టించి మృతదేహాన్ని సమీపం నుండి పరిశీలించి, టిపూ మరణాన్ని దృవపర్చుకున్నాడు. ఆతరువాత  టిపూ మరణించాడని నిర్ధారదించుకుని, ఆనందం పట్టలేక కేరింతులు కొడుతూ,  'ఈ నాటి నుండి ఇండియా మనది ' (Now India is Ours) అని జనరల్‌ హరిస్‌ ప్రకటించాడు. టిపూ విూద విజయం సాధించాక జరిగిన విందులో  ఆంగ్లేయాధికారి Thomas Minro, " We can easily capture all of India but Tipu is the only hurdle.." అన్నాడంటే టిపూ బ్రిటీషర్ల దురాక్రమణను ఎంతగా బలంగా ఎదుర్కొన్నాడో  ఆయన వారి దురాక్రమణకు ఎంతగా అవరోధం అయ్యాడోబ్రిటీషర్ల పురోగతిని టిపూ ఎంతగా నిలువరించాడో ఈ మాటల వలన అవగతం అవుతుంది.
            ఈ విధంగా బ్రిటీషర్లతో కదన రంగాన  పోరాడుతూ, రణ భూమిలోనే చివరి శ్వాస వదలిన స్వదేశీ పాలకులలో టిపూ ప్రధముడని చరిత్ర ఆయనను కీర్తిచింది. (.."Tipu Sultan was the single brave hero of Indian Histroy who fighting the Britishers met his martydom in the battle field..." Prof.Jaya Prakash) ప్రజల మనస్సులలో టిపూ ఎర్పరచుకున్న సుస్ధిర స్ధానాన్ని గమనించిన గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ బ్రిటీష్‌ సైన్యాధికారులకు ఇచ్చి విందులో మాట్లాడుతూ, ' మిత్రులారా మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచ మర్చి పోవచ్చు. అయితే టిపూ స్మృతులు కలకాలం నిలచిపోగలవు ' (.."I fear my friends that Tipu's memor will live long after the world has ceased to remember you and me...")  అని ఘనంగా నివాళులు అర్పించటం విశేషం. శత్రువు చేత కూడా ఘనమైన నివాళులు, ప్రశంసలు అందుకున్న టిపూ లాంటి స్వదేశీ పాలకులు భారతదేశ చరిత్రలో అరుదు. చివరి నెత్తూరు బొట్టు నేలరాలే వరకు బ్రిటీషర్లతో పోరాడి, భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డగా ఖ్యాతిగాంచి టిపూ సుల్తాన్‌ చిరిత్రపుటలలో అరుదైన శాశ్వత స్ధానం పొందాడు.
            టిపూ కన్నుమూసాక బ్రిటీష్‌ కూటమిలోని సైన్యాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. టిపూ  రాజ్య రాజధాని నగరమైన  శ్రీరంగపట్నం మీద బ్రిటీష్‌, నిజాం, మరాఠా సైనికలు విజృంభించారు. ఈ విజృంభన మూడు రోజుల పాటు యధేచ్చగా సాగింది. శ్రీరంగపట్నం ప్రజలను సైననికులు అన్ని విధాల దోచుకున్నారు. టిపూ కుటుంబీకులతో సహా, సామాన్య ప్రజలను శారీరంగా, మానసికంగా హింసల పాల్జేసాయి. స్త్రీలు, వృద్ధులు, పిల్లలను బేదం లేకుండా బ్రిటీషర్లు శ్రీరంగపట్నం వాసుల మీద అత్యాచారాలకు, అంతులేని దోపిడికి పాల్పడిముప్పు తిప్పలు పెట్టి, తమను మట్టి కరిపించిన టిపూ సుల్తాన్‌ మీదనున్న కసిని  భయంకరంగా తీర్చుకున్నాయి. శ్రీ రంగపట్నాన్ని స్మశానవాటిక చేసిగాని ఆ సైనికులు అక్కడనుండి నిష్క్రమించలేదు. ఈ అకృత్యాలను, కర్ణాటక ప్రభుత్వం మాజీ మంత్రి, చరిత్రకారుడు జనాబ్‌ మహమ్మద్‌ మొయినుద్దీన్‌ రాసిన ' శ్రీ రంగపట్నం అఫ్‌టర్‌ డాన్‌ ' గ్రంధంలో సవివరంగా పేర్కొన్నారు.
       -సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌.